News March 11, 2025

సత్యసాయి జిల్లాలో 543 మంది గైర్హాజరు

image

జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులలో 12,320 మంది విద్యార్థులకు గానూ 11,877మంది హాజరైనట్లు డీఐఈఓ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులలో 1,642మందికి గానూ 1,542 మంది హాజరయ్యారన్నారు. 543 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు.

Similar News

News February 18, 2026

ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా?

image

చర్మ ఆరోగ్యం కోసం ఫేస్ ప్యాక్స్ వాడటం మంచిదే కానీ వాటిని తరచూ వాడితే చర్మం పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. అలాగే మార్కెట్లో కొని వాడే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే ఆరిన వెంటనే శుభ్రం చెయ్యాలి. కొత్తరకం ఫేస్ ప్యాక్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ముఖం శుభ్రం చేసుకోకుండా ఫేస్ ప్యాక్‌ని అప్లై చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని గుర్తుంచుకోవాలి.

News February 18, 2026

ప్రకృతి సేద్యం.. APCNF ప్రధాన ఉద్దేశం ఇదే

image

వ్యవసాయాన్ని ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో, దీర్ఘకాలిక స్థిరత్వంతో సాగించే విధానంగా అభివృద్ధి చేయడమే APCNF లక్ష్యం. మొక్కకు కాదు, నేలకు ఆహారం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఇది ముందుకు సాగుతోంది. ఘన, ద్రవ జీవామృతం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, అగ్నాస్త్రం సహా ఇతర సహజ సూక్ష్మపోషకాలను పంటలకు అందిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు చేరువ చేయడంలో APCNF కీలకపాత్ర పోషిస్తోంది.

News February 18, 2026

JGL: కాంగ్రెస్ అధిష్ఠానంతో జీవన్‌రెడ్డి ‘తాడోపేడో’!

image

మాజీ మంత్రి జీవన్ రెడ్డి చాలా రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలో చేర్చుకొని అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై హైకమాండ్‌తో చర్చించడానికి ఆయన మంగళవారం ఢిల్లీకి పయనమయ్యారు. పార్టీ మార్పు లేదా కీలక పదవి లక్ష్యంగా తాడోపేడో తేల్చుకునేందుకు ఈ పర్యటన సాగుతోందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం బుజ్జగిస్తుందా లేక ఆయన కఠిన నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి.