News April 12, 2025
సత్యసాయి జిల్లాలో 6,771 మంది ఫెయిల్

ఇంటర్ ఫలితాల్లో సత్యసాయి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 8,952 మంది పరీక్షలు రాయగా 6,986 మంది పాసయ్యారు. 78 శాతం పాస్ పర్సంటేజీతో సత్యసాయి జిల్లా రాష్ట్రంలోనే 21వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 11,173 మందికి 6,368 మంది పాసయ్యారు. 57 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 24 వ స్థానంలో జిల్లా నిలిచింది.
Similar News
News April 13, 2026
HYD: భర్త డ్యూటీకి.. భార్య వీడియో కాల్స్

ఆడియో, వీడియో కాల్ యాప్స్ సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. HYD సహా ఇతర ప్రాంతాల్లో చదువుకునే వారి నుంచి మహిళల వరకు యువకులకు వల వేస్తూ డబ్బు సంపాదనలో మునిగి, విలువలను మరుస్తున్నారు. మరికొందరేమో భర్త డ్యూటీకి వెళ్లాక అబ్బాయిలతో టైంపాస్ కోసం, జనరల్ టాకింగ్ అంటూ ఇలాంటి యాప్స్నకు ఆకర్షితులవుతున్నట్లు Gen-S సర్వే తెలిపింది. భార్య లేనప్పుడు భర్తలు సైతం వీటిలోకి టైమ్ పాస్ అంటూ వస్తున్నట్లు పేర్కొంది.
News April 13, 2026
రాకా: సైన్స్ ఫిక్షన్+ మైథాలజీ?

అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘రాకా’లో అల్లు అర్జున్ లుక్ మూవీపై హైప్ను పెంచింది. ఈ చిత్రంపై ఓ క్రేజీ బజ్ వైరలవుతోంది. ఇందులో సైన్స్ ఫిక్షన్తోపాటు మైథాలజీని కూడా టచ్ చేసినట్లు సమాచారం. తోడేళ్లకు సంబంధించి పురాణాల్లో ఉన్న ఆసక్తికర అంశాలను ఈ సినిమాలో మిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండగా దీపికా పదుకొణె, రష్మిక కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్.
News April 13, 2026
కర్నూలు రేంజ్లో 25 మంది సీఐల బదిలీ

కర్నూలు రేంజ్ పరిధిలో భారీగా పోలీసు అధికారుల స్థానచలనం జరిగింది. పరిపాలన కారణాలతో 25 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఈ పోస్టింగ్లు ఇచ్చారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు కొందరిని వీఆర్కు పంపారు. బదిలీ అయిన అధికారులు వెంటనే స్పందించి బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.


