News March 29, 2025

సత్యసాయి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

image

ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్టు ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించినందున కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

మామిడిలో జింకు లోపం – లక్షణాలు

image

సాధారణంగా చౌడు నేలల్లోని మామిడి తోటల్లో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకు లోపముంటే ఆకులు చిన్నవిగా మారి సన్నబడి పైకి లేదా కిందకు ముడుచుకుపోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి, ఆకులు గులాబీ రేకుల వలే గుబురుగా తయారవుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి కాయల పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది.

News December 4, 2025

ఖమ్మం: మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శనీయం: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో పాల్గొని చిత్రపటానికి నివాళి అర్పించారు. రోశయ్య ఆర్థిక, విద్య, వైద్య, రవాణా తదితర శాఖల్లో సేవలందించడమే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు-కర్ణాటక గవర్నర్‌గా పనిచేసిన మహనీయుడని కలెక్టర్ అన్నారు.

News December 4, 2025

ఈ రైల్వే లైన్ కోనసీమ ప్రజల చిరకాల వాంఛ: ఎంపీ గంటి

image

అమలాపురం పార్లమెంటు పరిధిలోని కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవును అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాధుర్ కోరారు. కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ నిర్మాణం కోనసీమ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని ఆయనకు వివరించారు. ఇప్పటివరకు జరిగిన రైల్వే లైన్ పనుల గురించి ఆయన మంత్రికి వివరాలు తెలియజేశారు.