News March 29, 2025
సత్యసాయి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్టు ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించినందున కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Similar News
News April 20, 2025
ఏం తప్పు చేశామో తెలియట్లేదు: పరాగ్

గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం బాధ కలిగించిందని RR కెప్టెన్ రియాన్ పరాగ్ చెప్పారు. ‘మేం ఏం తప్పు చేశామో తెలియట్లేదు. 18-19 ఓవర్ వరకు మాదే గెలుపు అనుకున్నాం. 19 ఓవర్లోనే మ్యాచ్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఓటమికి నాదే బాధ్యత. అలాగే మా బౌలింగ్లో చివరి ఓవర్ సందీప్ శర్మ ఎక్కువ రన్స్ ఇచ్చారు. అతను మంచి బౌలరే కానీ అతని బ్యాడ్ లక్. సమద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు’ అని పేర్కొన్నారు.
News April 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 20, 2025
KMR: స్విమ్మింగ్ ఫూల్లో మునిగి యువకుడి మృతి

బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. బంధువుల ఇంట్లో పెద్దమ్మ తల్లి ఉత్సవాల కోసం వెళ్లిన నగేష్ అనే యువకుడు సరదాగా స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడానికి వెళ్లాడు. స్విమ్మింగ్ ఫూల్లో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నగేష్ హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు.