News March 19, 2025

సత్యసాయి: ‘పది సూత్రాలు తప్పక అమలు చేయాలి’

image

స్వర్ణాంధ్ర విజన్ 2047కు పది సూత్రాలు కచ్చితంగా అమలు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని పలు శాఖల అధికారులను ఆదేశించారు. నియోజకవర్గం స్థాయిలో విజన్ డాక్యుమెంట్ కార్యరూపం దాల్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Similar News

News November 14, 2025

పల్నాడు జిల్లాలో పులి, మొసలి కలకలం

image

పల్నాడు జిల్లాలో పులి, మొసలి సంచారం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం వెల్దుర్తి మండలం వజ్రాల తండా వద్ద రెండు గేదెల మీద పులి దాడి చేసింది. మాచర్ల రామ టాకీస్ వద్ద చంద్రవంక వాగులో మొసలి సంచరించటం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ వాగులో మహిళలు బట్టలు ఉతుకుతూ ఉంటారు. పులిజాడను కనిపెట్టేందుకు ఆటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొసలిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

News November 14, 2025

జూబ్లీ ఫలితాన్ని గమనిస్తున్న ఖమ్మం జిల్లా ప్రజలు

image

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని ఉమ్మడి ఖమ్మం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా?ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇదే ఊపుతో స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని టాక్.

News November 14, 2025

జూబ్లీహిల్స్: రెండు రౌండ్లలో కలిపి పోలైన ఓట్లు ఎన్నంటే?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ 1,144 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 18,617, BRS అభ్యర్థికి 17,473 ఓట్లు పోలయ్యాయి. మరో 8 రౌండ్లు మిగిలి ఉన్నాయి.