News March 19, 2025

సత్యసాయి: ‘పది సూత్రాలు తప్పక అమలు చేయాలి’

image

స్వర్ణాంధ్ర విజన్ 2047కు పది సూత్రాలు కచ్చితంగా అమలు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని పలు శాఖల అధికారులను ఆదేశించారు. నియోజకవర్గం స్థాయిలో విజన్ డాక్యుమెంట్ కార్యరూపం దాల్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Similar News

News December 9, 2025

విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న CM

image

CM చంద్రబాబు ఈనెల 12న‌ విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. ముందుగా మధురవాడ ఐటీ సెజ్ హిల్-2లో ప్రముఖ IT కంపెనీ కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వీఈఆర్ సమావేశానికి హాజరై, వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్ష చేస్తారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

News December 9, 2025

13న నరసాపురంలో జాతీయలోక్ అదాలత్: జడ్జి

image

ఈ నెల 13న నర్సాపురంలోని అన్ని కోర్టు సముదాయాలలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపురం పదో అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి తెలిపారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు సహకరించాలని న్యాయమూర్తి సూచించారు. రాజీపడదగిన అన్ని క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ వాహన ప్రమాద భీమాకు సంబంధించిన కేసులు, సివిల్ తగాదాలు, కుటుంబ తగాదాలు రాజీ చేసుకోవచ్చని చెప్పారు.

News December 9, 2025

KMR: తొలి దశ పోలింగ్‌కు రంగం సిద్ధం: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా, మొదటి దశలో ఎన్నికలు జరిగే మండలాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియ మంగళవారం పూర్తయింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో ఈ ర్యాండమైజేషన్ జరిగింది. మొదటి దశలో జీపీలు 157, 1444 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి 1457 టీములకు సంబంధించిన మండలాల వారీగా ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.