News March 19, 2025
సత్యసాయి: ‘పది సూత్రాలు తప్పక అమలు చేయాలి’

స్వర్ణాంధ్ర విజన్ 2047కు పది సూత్రాలు కచ్చితంగా అమలు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని పలు శాఖల అధికారులను ఆదేశించారు. నియోజకవర్గం స్థాయిలో విజన్ డాక్యుమెంట్ కార్యరూపం దాల్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
Similar News
News November 20, 2025
SKLM: ‘సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి’

సివిల్ సర్వీస్ ఉచిత కోచింగ్ పొందేందుకు నవంబర్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 80 ఫీట్ రోడ్డులో గల బీసీ స్టడీ కార్యాలయంలో ధ్రువపత్రాలను సమర్పించిన అనంతరం డిసెంబర్ 5న వెరిఫికేషన్ స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. కుల ప్రాతిపదిక పైన ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 10 నుంచి విజయవాడలోని గొల్లపూడి సర్కిల్లో ఉచిత కోచింగ్ ఇస్తారన్నారు.
News November 20, 2025
ఎన్టీఆర్ వైద్యసేవలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ అమలులో నిర్లక్ష్యం వహించినా, చిన్న ఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టరు కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన వైద్య సేవలు – జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో కలసి కలెక్టర్ పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
News November 20, 2025
NRPT: గ్రంథాలయాలు విజ్ఞాన బండగారాలు

గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు అని, పుస్తకపఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుందని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ విజయ్ కుమార్, మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి అన్నారు. 58వ గ్రంథాలయాల వారోత్సవాలను పురస్కరించుకొని నారాయణపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల విజేతలకు బహుమతులు అందించారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. నేతలు పాల్గొన్నారు.


