News March 7, 2025
సత్యసాయి: ఫోన్ మహిళల జీవితాలను మారుస్తుంది.!

ఒకే ఒక సెల్ ఫోన్ మహిళల జీవితాలను మారుస్తుందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. మహిళ వారోత్సవాల్లో భాగంగా.. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో షార్ట్ ఫిలిం ద్వారా, సెల్ఫోన్ వాడకం, సైబర్ నేరాలు, వాట్సప్ వంటి వాటిపై జరిగే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించారు. నిత్యజీవితంలో సెల్ ఫోన్ మహిళల జీవితాలపై విపరీతమైన ప్రభావం చూపుతోందన్నారు.
Similar News
News November 17, 2025
ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.
News November 17, 2025
ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.
News November 17, 2025
మలికిపురం: ఇద్దరు పిల్లలతో సహా వ్యక్తి అదృశ్యం

మలికిపురం మండలం లక్కవరానికి చెందిన సిరిగినీడి దుర్గాప్రసాద్ ఇద్దరు పిల్లలతో సహా సోమవారం అదృశ్యమయ్యాడు. ఇద్దరు పిల్లలను ఆధార్ కార్డుల కోసం మధ్యాహ్నం ఇంటి నుంచి తీసుకువచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దిండి చించినాడ వారధిపై బైకు, జోళ్లు విడిచి పిల్లలతో సహా అదృశ్యమయ్యాడు. పిల్లలతో సహా నదిలో దూకాడా లేక ఎక్కడికైనా పిల్లల్ని తీసుకొని వెళ్లాడా అన్నది మిస్టరీగా మారింది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


