News March 25, 2025

సత్యసాయి: భార్యపై హత్యాయత్నం.. భర్తకు పదేళ్ల జైలు శిక్ష

image

భార్యపై హత్యాయత్నం చేసిన కేసులో భర్తకు న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించిందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. పుట్టపర్తి రూరల్ మండలంలోని వెంకటగారిపల్లి గ్రామానికి చెందిన గాయత్రిపై భర్త రాజశేఖర్ హత్యాయత్నం చేయగా 2017 అక్టోబర్ 11న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం రుజువు కావడంతో అనంతపురం జిల్లా న్యాయమూర్తి శోభారాణి నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధించింది.

Similar News

News November 24, 2025

ఆఖరి మజిలీలో అడవి పార్టీ!

image

అట్టడుగు వారికి చట్టం చేయని న్యాయం తుపాకీ గొట్టం చేస్తుందని నమ్మిన అడవి పార్టీ ఆఖరి మజిలీలో ఉంది. అర్ధ శతాబ్దం క్రితం సమాజంలో వారి అవసరం, ఆ స్థాయిలో మద్దతూ ఉండేవి. కాలంతో పాటు పరిస్థితులు, ప్రజల జీవనం మారాయి. కానీ నక్సలైట్లుగా మొదలై మావోయిస్టులుగా రూపాంతరం చెందినా తమ పోరాట పంథా మార్చుకోలేదు. ఫలితం.. ప్రజలకు పరిష్కారం అవుతామన్న ‘అన్న’ తమ ఊపిరి ఉండాలంటే ‘గన్ను’ వీడటమే పరిష్కారమనేలా చేసింది.

News November 24, 2025

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ వినూత్న కార్యక్రమం

image

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేపట్టిన ‘చదవండి.. అర్థం చేసుకొండి.. ఎదగండి’ కార్యక్రమం జిల్లాలో ఉద్యమంలా సాగుతోంది. 958 పాఠశాలల్లోని 28,982 మంది విద్యార్థులకు దీనిని అమలు చేస్తున్నారు. కలెక్టర్ చొరవతో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగైందని విద్యా యంత్రాంగం గుర్తించింది.

News November 24, 2025

ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణ శరవేగం.. నెరవేరనున్న యువత కలలు

image

ఖమ్మం జిల్లాలో ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్త ఐటీ కంపెనీలకు సౌకర్యాలు, రాయితీలను ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం 2 వేల మంది ఉద్యోగులు ఉండగా, రాబోయే ఐదేళ్లలో 10 వేలకు పైగా ఐటీ ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కనున్నాయని అధికారులు తెలిపారు.