News April 4, 2025

సత్యసాయి: ‘భూ సేకరణ పెండింగ్ పనులను పూర్తి చేయాలి’

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూ సేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో NH 342, 716జి, జాతీయ రహదారులు, వివిధ భూసేకరణకు సంబంధించిన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. భూ కేటాయింపు ప్రతిపాదనలపై వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదికలను అందించాలన్నారు.

Similar News

News October 3, 2025

TTD ఆన్‌లైన్ అడ్వాన్స్ బుకింగ్‌లో మార్పులు..!

image

తిరుమల అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఈవో శుక్రవారం జరిగింది. ప్రస్తుతం 3నెలల ముందు ఆన్‌లైన్‌లో దర్శన టికెట్ల విడుదల చేస్తుండగా ఈ విధానాన్ని మార్చాలని పలువురు భక్తులు కోరారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. 3నెలల అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌‌లో మార్పులకు ప్రయత్నిస్తామన్నారు. నెల రోజుల ముందే టికెట్లు విడుదల చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి TTD బోర్డు నిర్ణయయం ఎలా ఉంటుందో?

News October 3, 2025

MDK: ఎన్నికలు.. ఖర్చు పెట్టే వారికే టికెట్లు?

image

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు జరిగే ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 9న విడుదల చేయనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఖర్చు పెట్టుకుంటామని ముందుకు వచ్చే వారికే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. దీనిపై మీ కామెంట్.

News October 3, 2025

కరీంనగర్: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

కరీంనగర్ నగరంలోని విద్యానగర్‌లో దాసరి కృష్ణ కుమార్ గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చేర్ల బూత్కూర్ గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ కొంతకాలంగా KNRలో ఉంటున్నాడని, ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడినట్లు చెప్పారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీ గదికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.