News January 26, 2025

సత్యసాయి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

అన్నమయ్య జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి నుంచి కోళ్లతో వస్తున్న బొలెరో బి. కొత్తకోట వద్ద కనిగలతోపు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలేరోలోని డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఇదే సమయంలో బొలెరో ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 10, 2025

జగిత్యాల మెడికల్ కాలేజీని సందర్శించిన ఎమ్మెల్యే

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బుధవారం సందర్శించారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే విజన్‌తోనే కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ 33 మెడికల్ కాలేజీల రాష్ట్రంగా మార్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మెడికల్ కాలేజీలో సదుపాయాల కల్పనలో విఫలమైందన్నారు.

News December 10, 2025

ఓటు హక్కు వినియోగానికి 18 రకాల కార్డులు: కలెక్టర్

image

ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 18 రకాల ధ్రువపత్రాల్లో దేనినైనా ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎలక్షన్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, పోస్ట్ ఆఫీస్/బ్యాంకు పాస్ బుక్, పాన్ కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, ఫొటోతో కూడిన కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు.

News December 10, 2025

గర్భంలోని బిడ్డకు HIV రాకూడదంటే..

image

హెచ్‌ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్‌ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్‌ సంక్రమించే అవకాశాలుంటాయి. కాబట్టి సీ సెక్షన్ చేయించడం మంచిది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్‌ఐవీ మందులు వాడటం వల్ల వైరస్‌ బిడ్డకు సోకి ఉంటే నాశనమవుతుంది.