News March 19, 2025

సత్యసాయి: వినియోగదారులకు అందుబాటులో ఇసుక

image

ఇసుకను వినియోగదారులకు అందుబాటులో ఉంచుదామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్.చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా ఎస్పీ రత్నతో కలసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నీటి ప్రవాహాలకు ఆనుకుని ఉన్న గ్రామాలలో గృహాల నిర్మాణం, ప్రభుత్వ పనులకు ఇసుకను ఉచితంగా తీసుకెళ్ళవచ్చునన్నారు.

Similar News

News November 20, 2025

ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

image

☛ 16 ఏళ్లలోపు టీనేజర్లు సోషల్‌మీడియా వాడకూడదనే నిబంధన ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి అమలులోకి రానుంది. ఆ టీనేజర్ల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయనుంది.
☛ ఇండోనేషియాలోని సీరమ్ ఐలాండ్‌లో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
☛ చెక్ రిపబ్లిక్‌ సౌత్ ప్రాగ్‌కు 132 కి.మీ దూరంలో 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా, 40 మంది స్వల్పంగా గాయపడ్డారు.

News November 20, 2025

ప్రకాశం: రేషన్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్.!

image

ప్రకాశం జిల్లాలో 1392 రేషన్ షాపుల ద్వారా 651820 రేషన్ కార్డుదారులకు రేషన్ అందుతోంది. ఇటీవల జిల్లాలో ప్రభుత్వం స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభించింది. అయితే సచివాలయ సిబ్బంది, డీలర్లు ఇప్పటివరకు 592800 స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 59020 కార్డులను లబ్ధిదారులు తీసుకోవాల్సిఉంది. ఈనెల 30లోగా కార్డులను స్వీకరించకుంటే, వెనక్కుపంపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

News November 20, 2025

ANU దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టులో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ రామచంద్రన్ గురువారం విడుదల చేశారు. పీజీ కోర్సులకు రీవాల్యుయేషన్‌కు ప్రతి పేపర్‌కు రూ. 960 చొప్పున ఈ నెల 29లోగా ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు.