News March 19, 2025

సత్యసాయి: 10th పరీక్షలకు 141 మంది గైర్హాజరు.!

image

శ్రీ సత్యసాయి జిల్లాలో బుధవారం జరిగిన పదవ తరగతి పరీక్షలలో 141 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. జిల్లాలోని 104 కేంద్రాలలో రెగ్యులర్ విద్యార్థులు 21,240 మందికి గాను 21,109 మంది విద్యార్థులు హాజరయ్యారని, 31 మంది ప్రైవేట్ విద్యార్థులకు గాను పదిమంది గైర్హాజరయ్యారన్నారు.

Similar News

News December 4, 2025

MHBD: ‘గుర్తులు’ వచ్చే వరకు మమ్మల్ని కాస్త ‘గుర్తు’ పెట్టుకోండి..!

image

MHBD జిల్లాలో మొదటి, 2వ విడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. గ్రామాల్లో ఎన్నికల వేడి పెరిగి ప్రచార జోరు సాగుతోంది. ఆయా గ్రామాల్లో ఉదయం నుంచే అభ్యర్థులు ఓటర్ల ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. గుర్తులు ఇంకా కేటాయించకున్నా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గుర్తులు వచ్చే దాక తమని గుర్తుంచుకోవాలని ఓటర్లను వేడుకుంటున్నారు. గ్రామాలల్లో పోటాపోటీ రాజకీయం మొదలైంది.

News December 4, 2025

ఖమ్మం: మొదటి విడతలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలు ఇవే..!

image

ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల వివరాలను అధికారులు వెల్లడించారు. బోనకల్(M)- కలకోట, చింతకాని(M)- రాఘవాపురం, రేపల్లెవాడ, మధిర(M)- సిద్దినేనిగూడెం, సైదల్లిపురం, వైరా(M)- లక్ష్మీపురం, గోవిందాపురం, నారపునేనిపల్లి, రఘునాథపాలెం(M)- మల్లేపల్లి, రేగులచలక, మంగ్యాతండా, రాములుతండా, ఎర్రుపాలెం(M)- గోసవీడు, చొప్పకట్లపాలెం, జమలాపురం, కండ్రిక, గట్ల గౌరారం, కాచవరం.

News December 4, 2025

జిల్లాలో 3,191 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం: కలెక్టర్

image

జిల్లాలో రూ.3,191 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం జిల్లాను వేగంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్తుందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ న్యూ వీసీ హాల్లో హైబ్రిడ్ మోడ్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. చేపట్టిన పనులను అధికారులు వేగంగా పూర్తి చేయాలన్నారు.