News April 1, 2025

సత్యసాయి: ‘15 రోజుల్లో నీటి తొట్టెలు పూర్తి చేయాలి’

image

శ్రీ సత్యసాయి జిల్లాకు మంజూరైన నీటి తొట్టెలను 15 రోజులలో నిర్మించి పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి మండలంలోని కప్పల బండలో నీటి తొట్టె నిర్మాణానికి భూమి పూజ చేసి, అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు 1362 నీటి తొట్టెలు మంజూరు అయ్యాయని అన్నారు. నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని మూగజీవాలకు తాగునీటి సౌలభ్యం కొరకు వెంటనే నిర్మాణం చేపట్టాలన్నారు.

Similar News

News November 5, 2025

బైకులకు టోల్ ట్యాక్స్ ఎందుకుండదో తెలుసా?

image

నేషనల్ హైవేస్ టోల్ రూల్స్ 2008 రూల్ 4(4) ప్రకారం టూవీలర్స్‌ టోల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. కార్లు, హెవీ వెహికల్స్‌తో పోలిస్తే బైకులతో రోడ్లు ఎక్కువ డ్యామేజ్ కావు. బండి కొనేటప్పుడే రోడ్ ట్యాక్స్ కడతాం. దానినే పరోక్షంగా రోడ్లు, హైవేల నిర్వహణకు వాడతారు. బైక్‌పై టోల్ ట్యాక్స్ వేస్తే ఆదాయం కంటే.. డబ్బు వసూలు చేయడానికే ఎక్కువ ఖర్చవుతుంది. అంతకు మించి అన్ని టోల్స్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది.

News November 5, 2025

గిరిజనుల సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

కోట, వాకాడు, చిల్లకూరు, గూడూరు, డి.వి.సత్రం మండల్లోని గిరిజనుల సమస్యలపై కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. చైల్డ్ లేబర్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు బషీర్, పలువురు MROలు, MPDOలు, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు. గిరిజనులకు తాగునీరు, గృహాలు, భూమి, అటవీ హక్కుల పట్టాలు, పాఠశాలలు, రహదారులు, అంగన్వాడీలు, గ్రంథాలయాల వంటి అంశాలపై కలెక్టర్ వారితో చర్చించారు.

News November 5, 2025

శివ నామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు

image

నల్గొండ జిల్లాలో కార్తీక మాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. జిల్లాలో చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామీ, పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంతో పాటు వివిధ ఆలయాలకు భక్తులు ఉదయమే పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయాలు దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.