News March 29, 2024

సదరం క్యాంపును సద్వినియోగ పరుచుకోవాలి: DRDO సాయన్న

image

సదరం ధ్రువీకరణ పత్రం కోసం నూతన, రెన్యువల్ దరఖాస్తుదారుల కోసం ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన తేదీలు విడుదల చేసినట్లు DRDO సాయన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి జూన్ 19 వరకు మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తమకు నిర్ణయించిన తేదీల్లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలోని సదరం క్యాంపులో వైద్య పరీక్షలు చేపించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 8186000940 నంబర్‌కు సంప్రదించాలన్నారు

Similar News

News November 12, 2025

ఆదిలాబాద్: పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలి

image

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బజార్‌హత్నూర్‌, ఇంద్రవెల్లి, తలమడుగు, తాంసి, ఉట్నూర్‌ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాల పురోగతిపై రెండవ దశ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలు తప్పనిసరి అన్నారు.

News November 12, 2025

ADB: కౌలు రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలి

image

ఆదిలాబాద్ జిల్లాలోని కౌలు రైతులు అలాగే డిజిటల్ సంతకం లేని భూములు, పీపీ భూములు, పార్ట్–3 భూములు కలిగిన రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కనీస మద్దతు ధరకు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులు తమ పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి నమోదు చేసుకోవాలంటే ఏఈఓ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు.

News November 12, 2025

ఉట్నూర్: తండ్రిని చంపిన కొడుకుకి 7ఏళ్ల జైలు శిక్ష

image

ఉట్నూర్ మండలం రాజన్న గూడకు చెందిన గడ్డం భగవాన్ 2024 సెప్టెంబర్ 13న మద్యం మత్తులో తండ్రిని చంపాడు. డబ్బుల కోసం తలపై దాడిచేయడంతో చికిత్స పొందుతూ అతడి తండ్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఉట్నూర్ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అతడికి 7ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు.