News March 29, 2024
సదరం క్యాంపును సద్వినియోగ పరుచుకోవాలి: DRDO సాయన్న
సదరం ధ్రువీకరణ పత్రం కోసం నూతన, రెన్యువల్ దరఖాస్తుదారుల కోసం ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన తేదీలు విడుదల చేసినట్లు DRDO సాయన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి జూన్ 19 వరకు మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తమకు నిర్ణయించిన తేదీల్లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలోని సదరం క్యాంపులో వైద్య పరీక్షలు చేపించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 8186000940 నంబర్కు సంప్రదించాలన్నారు
Similar News
News January 17, 2025
మందమర్రి: కారుణ్య నియామకాలతో 1806 కొలువులు
మందమర్రి ఏరియాలో నూతనంగా ఉద్యోగాలు పొందిన 8 మంది డిపెండెంట్లకు జీఎం దేవేందర్ గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా 1806 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. నూతన కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరై అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
News January 17, 2025
సర్వే పారదర్శకంగా నిర్వహించాలి: ADB కలెక్టర్
లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించే సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం ఆదిలాబాద్లోని అనుకుంటలో సర్వేను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పై సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను సేకరించారు. కమిషనర్ సీవీఎన్ రాజు, తదితరులున్నారు.
News January 16, 2025
ఆదిలాబాద్: రైతు భరోసా సర్వేకు 102 బృందాలు
ADB జిల్లా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 62వేల పట్టా పాసు పుస్తకాలు ఉండగా ఆ డేటా ఆధారంగానే అధికారులు వెరిఫికేషన్ చేయనున్నారు. 102 క్లస్టర్లలో సర్వేకు 102 అధికార బృందాలు సిద్ధమయ్యాయి. ఇందులో వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొంటారు. గతంలో సాగు అనువుకాని భూమికి సైతం రైతుబంధు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో పకడ్బందీగా సర్వే చేయనున్నట్లు వారు చెబుతున్నారు.