News August 27, 2024

సదాశివ‌నగర్‌లో డెంగ్యూతో ఎవరూ మృతి చెందలేదు: వైద్యాధికారి

image

సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డెంగ్యూతో ఎవరూ చనిపోలేదని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఇటీవల రన్విత్ (9), మాన్విశ్రీ (12)లకు తీవ్ర జ్వరం రావడంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. కాగా వారికి మోతాదుకు మించి యాంటీబయోటిక్ మందులు ఇవ్వడంతోనే చనిపోయారని ఆయన స్పష్టం చేశారు. సదాశివనగర్‌కు చెందిన నరేశ్ షుగర్ సమస్యతో మృతి చెందాడని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

ముప్కాల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

తూప్రాన్ పట్టణ పరిధి కరీంగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శివానందం తెలిపారు. ముప్కాల్ గ్రామానికి చెందిన పన్నీర్ వెంకటేష్(24) ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 16న ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.

News November 20, 2025

నిజామాబాద్: NPOs/NGOs దరఖాస్తు చేసుకోవాలి: DYSO

image

2025-26 సంవత్సరానికి జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం (NPYAD) పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ (ఆర్థిక సహాయం) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DYSO పవన్ కుమార్ తెలిపారు. ఈ పథకం కింద అర్హత కలిగిన లాభాపేక్షలేని సంస్థలు (NPOs/NGOs) నుంచి ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News November 20, 2025

NZB: గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. అయితే ఈనెల 10న కిసాన్ గంజ్ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి పడి ఉండగా స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ ఈనెల15న మృతి చెందాడు. మృతుడికి సంబంధించి వివరాలు తెలియ రాలేదని, ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ నువ్వు సంప్రదించాలని తెలిపారు.