News February 8, 2025

సదాశివనగర్: బావిలో పడి వృద్ధురాలి ఆత్మహత్య

image

బావిలో పడి ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ రంజిత్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుశీల(70) గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆమె జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి గ్రామ శివారులోని బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ వెల్లడించారు.

Similar News

News November 22, 2025

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు!

image

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాలాలను బట్టి ఎండ, వానలు, చలి అన్నీ ఎక్కువగానే ఉంటున్నాయి. ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 273 రోజుల్లో 270 రోజులు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. ఈ ప్రభావంతో దేశంలో 4 వేల మందికి పైగా చనిపోయారని, 2.34 కోట్ల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని పేర్కొంది.

News November 22, 2025

ప.గో: హెలికాప్టర్ దిగగానే.. పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఇదిగో!

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 24న ద్వారకాతిరుమల మండలంలో పర్యటిస్తారు. కొయ్యలగూడెం (M) రాజవరంలో హెలిప్యాడ్‌లో దిగి అక్కడ నుంచి ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురం చేరుకుంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.

News November 22, 2025

తెనాలి పోక్సో కోర్టు సంచలన తీర్పు

image

తెనాలిలో ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిల్లా డేవిడ్ రాజుకు 20 ఏళ్ల జైలు శిక్ష , రూ.10 వేల జరిమానా విధిస్తూ తెనాలి పోక్సో కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. 2021లో బహిర్భూమికి వెళ్ళిన బాలికపై డేవిడ్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కాగా శిక్ష ఖరారు చేశారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పులో చెప్పారు.