News February 8, 2025

సదాశివనగర్: బావిలో పడి వృద్ధురాలి ఆత్మహత్య

image

బావిలో పడి ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ రంజిత్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుశీల(70) గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆమె జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి గ్రామ శివారులోని బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ వెల్లడించారు.

Similar News

News March 27, 2025

సూర్యాపేట: బైక్ అదుపు తప్పి బాలుడి మృతి

image

బైక్ అదుపు తప్పి బాలుడు మృతిచెందిన ఘటన నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన బొప్పని రిషి (10) బుధవారం మృతిచెందాడు. ఎస్ఐ మహేంద్రనాథ్ తెలిపిన వివరాలు.. పవన్ తన బావమరిది రిషితో కలిసి చిననెమిల క్రాస్ రోడ్ వైపు వెళుతున్నారు. బైక్ అదుపుతప్పడంతో రిషి చనిపోయాడు. బాలుడి తల్లి సుజాత ఫిర్యాదు మేరకు పవన్‌పై కేసు నమోదైంది. 

News March 27, 2025

వనపర్తి: క్రీడాకారులు, నిర్వాహకులను అభినందించిన ఎస్పీ

image

వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం క్రీడా మైదానంలో మెడికల్ విద్యార్థులకు నిర్వహించిన వార్షిక క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులతో పాటు, క్రీడల నిర్వాహకులను జిల్లా ఎస్పీ గిరిధర్ అభినందించారు. ఈ క్రీడల ద్వారా మీ శారీరక దేహ దారుఢ్యం మెరుగుపడుతుండటంతోపాటు, పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ కిరణ్మయి, వైద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News March 27, 2025

సైదాపూర్ : ట్రాక్టర్ కిందపడి వ్యక్తి దుర్మరణం

image

ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం ఆదర్శ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున మక్కల లోడుతో సైదాపూర్ నుంచి శంకరపట్నం వైపు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ దాని కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

error: Content is protected !!