News January 21, 2025

సదాశివనగర్ మాజీ సహకార సంఘం ఛైర్మన్ ఆత్మహత్య

image

సదాశివనగర్ మాజీ సహకార సంఘం ఛైర్మన్ జనగామ ప్రభాకర్ రెడ్డి (64) ఉరేసుకుని సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా వారి కుటుంబ సభ్యులు కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు. కాగా సోమవారం స్వగ్రామానికి వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 16, 2025

మంజీరా నది ఉరకలేస్తుంది..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. దీంతో ప్రాజెక్టులోని తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉద్ధృతి కారణంగా పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద మంజీర నది ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో 62,542 క్యూసెక్కులుగా ఉంది.

News September 16, 2025

కామారెడ్డిలో ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’

image

కామారెడ్డి జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 15 రోజులు జరిగే కార్యక్రమం విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

News September 16, 2025

సంగారెడ్డి: ‘శారీరక వైకల్యం విద్యార్థుల ప్రొఫార్మా సమర్పించాలి’

image

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న శారీరక వైకల్యం ఉన్న విద్యార్థుల ప్రొఫార్మా-I ను సమర్పించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్ల తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. శారీరక వైకల్యం ఉన్న విద్యార్థుల PH సర్టిఫికెట్లను డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. మార్చి 2026లో జరిగే రెగ్యులర్ SSC పబ్లిక్ పరీక్షలకు CWSN అభ్యర్థులకు మినహాయింపులు ఇవ్వనున్నట్టు తెలిపారు.