News February 22, 2025
సదాశివనగర్: సంతానం కలగలేదని మహిళ బలవన్మరణం..

సంతానం కలగలేదనీ తీవ్ర మనస్తాపం చెందిన మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సదాశివనగర్ గురువారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలిలా..అమర్లబండ వాసి ఎర్రోల రాజయ్య కు సత్తెవ్వ తో 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఇప్పటి దాకా పిల్లలు కాలేదు. దీంతో మన స్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి అన్న సాయిలు శుక్రవారం పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News October 16, 2025
తెనాలి: ఆధిపత్య పోరుతో అన్యాయంగా చంపేశారు..?

అమృతలూరు(M) కోరుతాడిపర్రుకు చెందిన జూటూరి తిరుపతిరావు@ బుజ్జి తెనాలిలో మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సంచలనం రేకెత్తించిన హత్య కేసును పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది.గ్రామంలోని రామాలయం విషయంలో ఆధిపత్య పోరుతో సమీప బంధువే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పక్కా ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది
News October 16, 2025
సంగారెడ్డి: ‘ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నవంబర్ 15 వరకు పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. గోజాతి, గేదె జాతి పశువుల రైతులు టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
News October 16, 2025
నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న ప్రధాని

నేడు శ్రీశైలం మల్లన్నను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకోనున్నారు. ఉదయం 11:15 ని శ్రీశైలంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వెళ్లే వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు సహకరించాలని కోరారు.