News February 22, 2025
సదాశివనగర్: సంతానం కలగలేదని మహిళ బలవన్మరణం..

సంతానం కలగలేదనీ తీవ్ర మనస్తాపం చెందిన మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సదాశివనగర్ గురువారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలిలా..అమర్లబండ వాసి ఎర్రోల రాజయ్య కు సత్తెవ్వ తో 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఇప్పటి దాకా పిల్లలు కాలేదు. దీంతో మన స్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి అన్న సాయిలు శుక్రవారం పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News November 18, 2025
‘వారణాసి’ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 130 అడుగుల ఎత్తైన LED స్క్రీన్, సీటింగ్, ఇతరత్రాలకు భారీగానే వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీడియో రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో <<18300800>>రాజమౌళి<<>> ఆవేదనలో మాట్లాడినట్లు తెలుస్తోంది.
News November 18, 2025
‘వారణాసి’ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 130 అడుగుల ఎత్తైన LED స్క్రీన్, సీటింగ్, ఇతరత్రాలకు భారీగానే వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీడియో రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో <<18300800>>రాజమౌళి<<>> ఆవేదనలో మాట్లాడినట్లు తెలుస్తోంది.
News November 18, 2025
పత్తి కొనుగోళ్లు పునః ప్రారంభించండి: మంత్రి తుమ్మల

ఖమ్మం: జిన్నింగ్ మిల్లులు తమ సమ్మెను తక్షణమే విరమించి, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి, తేమ నిబంధనలపై కేంద్రం సమీక్షించి, సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను CCIతో చర్చించి పరిష్కరిస్తామని తుమ్మల భరోసా ఇచ్చారు.


