News January 30, 2025
సదాశివపేటలో కారు ఢీకొని మహిళ మృతి

సదాశివపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పట్టణలోని పీఎస్ఎంఎల్ కాలనీ ఎదురుగా హైవేపై గురువారం సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 4, 2025
రాష్ట్రం నుంచి ముగ్గురు.. అందులో ఇద్దరు మనోళ్లే

ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈనెల 5 నుంచి 8వ తేది వరకు జరగనున్న నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్లో మహాదేవపూర్ బాలుర పాఠశాల సైన్స్ టీచర్ బి.ప్రభాకర్ రెడ్డి, బాలికల పాఠశాల సైన్స్ టీచర్ మడక మధు పాల్గొననున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 162 మంది సైన్స్ టీచర్లు కాన్ఫరెన్స్కు ఎంపికయ్యారు. కాగా, తెలంగాణ నుంచి ఎంపికైన ముగ్గురిలో ఇద్దరు మన మహాదేవపూర్ ఉపాధ్యాయులే కావడం గర్వకారణం.
News November 4, 2025
Way2Newsలో కథనం.. స్పందించిన సూర్యాపేట హౌసింగ్ పీడీ

‘సూర్యాపేట కలెక్టరేట్లో కదలని ఇందిరమ్మ ఇండ్ల ఫైల్స్’ అనే శీర్షికతో Way2Newsలో OCT 22న కథనం ప్రచురితమైంది. హౌసింగ్ పీడీ సిద్ధార్థ్ స్పందించి చొరవ తీసుకోని జాజిరెడ్డిగూడెంకి చెందిన దివ్యాంగురాలు చనగాని లక్ష్మమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రంలో మార్పులను సరిచేసి MPDOకు పంపించారు. గ్రామ సెక్రటరీ నవీన్ రెడ్డి మంజూరు పత్రాన్ని అందజేశారు. తన సమస్యను పరిష్కరించిన అధికారులకు లక్ష్మమ్మ కృతజ్ణతలు తెలిపారు.
News November 4, 2025
రోడ్ల నాణ్యతలో రాజీపడొద్దు: Dy.CM పవన్

AP: గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ‘సాస్కి’ పథకం ద్వారా సమకూర్చిన రూ.2 వేల కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘రహదారుల నాణ్యతలో రాజీపడొద్దు. అధికార యంత్రాంగానిదే బాధ్యత. ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నారో లేదో తనిఖీ చేయాలి. నేను, నిపుణులు క్షేత్రస్థాయిలో క్వాలిటీ చెక్ చేస్తాం’ అని చెప్పారు. రోడ్ల విషయంలో గత ప్రభుత్వం అలక్ష్యంతో వ్యవహరించిందని ఆరోపించారు.


