News April 10, 2025

సదాశివపేట: మహిళా అదృశ్యం.. కేసు నమోదు

image

మహిళా అదృశ్యమైన ఘటన సదాశివపేట మండలంలో జరిగింది. సీఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాలు.. మండలంలోని రేజింతల్ గ్రామానికి చెందిన మారేపల్లి లక్ష్మి(45) ఈనెల 7న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లింది. కుటుంబ సభ్యులు వెతికిన ఆచూకీ లభించలేదు. బాధితురాలి కుమారుడు మారేపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం తెలిస్తే 8712656721 సంప్రదించాలన్నారు.

Similar News

News November 23, 2025

నేడు శ్రీకాకుళం రానున్న విజయసాయిరెడ్డి

image

వైసీపీ ఓడిపోయిన అనంతరం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం వైసీపీ హయంలో పెద్ద ఎత్తున లిక్కర్‌ స్కాం జరిగిందని ఆరోపణలు చేసిన ఆయన బీజేపీలో చేరతారని వార్తలొచ్చినా అది జరగలేదు. అప్పటి నుంచి స్తబ్దుగా ఉన్న ఆయన ఆదివారం శ్రీకాకుళంలో జరిగే రెడ్డిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన ఏం మాట్లాడతారోనని ఆసక్తి నెలకొంది.

News November 23, 2025

సంస్థాగత నిర్మాణంపై ‘సేనాని’ దృష్టి

image

జనసేన సంస్థాగత నిర్మాణంపై ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. పిఠాపురంతో పాటు వివిధ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీల నియామకానికి కసరత్తు ప్రారంభించారు. గ్రామ స్థాయి వరకు పటిష్టమైన కమిటీలను వేసేందుకు ఆయన స్వయంగా కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ కమిటీల కూర్పునకు సంబంధించి ఆశావహుల పేర్ల సేకరణ పూర్తయినట్లు సమాచారం.

News November 23, 2025

HNK: హాఫ్ మారథాన్‌తో పాలకు బ్రేక్!

image

హనుమకొండ నగరంలో ఆదివారం ఉదయం నిర్వహిస్తున్న హాఫ్ మారథాన్ ప్రోగ్రాంతో పాల ప్యాకెట్ల డెలివరీకి ఆటంకం ఏర్పడింది. పోలీసులు రహదారులను రెండు వైపులా మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం పాల డెలివరీ చేసే వ్యాపారులను సైతం అడ్డుకోవడంతో Way2Newsకి ఫోన్ చేసి తమ ఇబ్బందులను వివరించారు.