News December 18, 2024
సదాశివపేట: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన సదాశివపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నిజాంపూర్ గ్రామంలో విద్యుత్ స్తంభంపై బల్బు అమర్చడానికి స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగలడంతో విద్యుత్ స్తంభంపైన మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News January 14, 2025
మెదక్: జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మంత్రి
జిల్లా ప్రజలకు మంత్రి దామోదర రాజనర్సింహ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. రైతు రుణమాఫీ, సకాలంలో ధాన్యం కొనుగోలు, సన్నాలకు రూ.500 బోనస్ తదితర కార్యక్రమాల్లో ప్రజల్లో హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి రైతులు, వ్యవసాయ కూలీలకు అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు, పేద ప్రజలకు ఉద్దేశించి రేషన్ కార్డుల జారీ చేయనున్నామని అన్నారు.
News January 14, 2025
MDK: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
మెదక్: సంతోషంగా పండగను జరుపుకోవాలి: ఎస్పీ
మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ పర్వదిన వేళ ప్రజలందరికి ప్రశాంతతను, ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకున్నారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలాన్నారు.