News October 18, 2024
సనాతన ధర్మ పరిరక్షణకు యువకుడి సైకిల్ యాత్ర
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లికి చెందిన మల్లేశ్ దేశంలోని ద్వాదశ (12) జ్యోతిర్లింగాల దర్శనార్థం గురువారం సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. మొదటగా పాలమూరు నుంచి తాండూరు మార్గంలో యాత్ర సాగనుంది. రోజుకు 100 కి.మీ.లు సైకిల్ యాత్ర చేసి స్థానిక ఆలయాల్లో బస చేస్తానని తెలిపాడు. సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ ఈ యాత్ర కొనసాగించనున్నట్లు అతడు పేర్కొన్నాడు.
Similar News
News October 18, 2024
NGKL: సర్వం సిద్ధం.. రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపిక
ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్లను ఈనెల 19న నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర)లలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, ప్రధాన కార్యదర్శి విలియమ్స్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ కార్డులతో హాజరుకావాలని, ఎంపికైన జట్లు రాష్ట్రస్థాయి జూనియర్స్ ఖోఖో టోర్నమెంట్లో పాల్గొంటారని అన్నారు.
News October 18, 2024
ఆదర్శ ప్రాయుడు సర్వాయి పాపన్న: మంత్రి పొన్నం
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అందరికి ఆదర్శప్రాయుడని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. గద్వాలలోని కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. మొఘల్రాజుల ప్రాబల్యం పెరుగుతున్నతరుణంలో వారి ఆధిపత్యం అంతమొందించడంతోపాటు జమీందార్లు, జాగీర్దార్ల దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగుల జెండాను పాపన్నగౌడ్ ఎగురవేశారని మంత్రి గుర్తుచేశారు.
News October 18, 2024
MBNR: పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
హన్వాడ మండలం అమ్మాపూర్ తాండ పంచాయతీ కార్యదర్శి శివప్రకాశ్ శుక్రవారం అధికారులు సస్పెండ్ చేశారు. శివప్రకాశ్ గతంలో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. ఈయన పని చేసిన కాలంలో రూ.1.73 కోట్ల గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని గత నెలలో జరిపిన DPLO విచారణలో తేలింది. ఈ మేరకు సస్పెన్షన్కు గురయ్యారు.