News April 4, 2025
సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: NRPT కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం నర్వ మండల కేంద్రంలోని చౌకధర దుకాణంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని చెప్పారు.
Similar News
News October 20, 2025
ములుగు: ద్రోహులకు శిక్ష తప్పదు.. ‘మావో’ లేఖ

మావోయిస్టు పార్టీకి మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు ముఠా వల్ల నమ్మకద్రోహం జరిగిందని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. వీరి మాయమాటలు నమ్మి కొందరు కామ్రేడ్స్ వీరి వెంట వెళ్లారని, వారంతా జీవితాలు ప్రశాంతంగా గడపాలన్నారు. విప్లవోద్యమ నష్టానికి కారకులైన మల్లోజుల, తక్కళ్లపల్లి ముఠాలకు శిక్ష తప్పదని, అమరుల త్యాగాల సాక్షిగా శపదం చేస్తున్నామన్నారు.
News October 20, 2025
బెజ్జూర్: శ్రావణిది కుల దురహంకార హత్యే: ఏన్క అమృత

ఇటీవల దహేగాం మండలంలో జరిగిన గర్భిణి శ్రావణి హత్య కుల దురహంకార హత్యే అని ఆదివాసీ మహిళా సంఘం మండలాధ్యక్షురాలు ఏన్క అమృత అన్నారు. ఈరోజు బెజ్జూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నిండు గర్భిణి అయిన ఆదివాసీ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన ఆమె మామ సత్తయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు రెండు హత్యల కేసులు నమోదు చేయాలన్నారు.
News October 20, 2025
బాసర నుంచి మాహుర్ హైవే అనుసంధానానికి రూట్ మ్యాప్

బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి క్షేత్రం నుంచి మహుర్ రేణుకా మాత మందిరం వరకు రెండు జాతీయ రహదారుల అనుసంధానానికి రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తే ఆధ్యాత్మిక మార్గం ఏర్పడుతుందని ప్రస్తావించడంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారని, ఈ మేరకు సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో రూట్ మ్యాప్ను సిద్ధం చేశారని చెప్పారు.