News April 4, 2025

సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: NRPT కలెక్టర్ 

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం నర్వ మండల కేంద్రంలోని చౌకధర దుకాణంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని చెప్పారు.

Similar News

News November 17, 2025

WONDER: ఒకేలా ఇద్దరి ఫింగర్‌ప్రింట్స్!

image

ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. కానీ తొలిసారి UP కాన్పూర్‌లో కవలలు ప్రబల్, పవిత్ర మిశ్రాల ఫింగర్‌ప్రింట్లు, రెటీనా సరిపోలినట్లు తెలుస్తోంది. ఒకరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయగా మరొకరిది డియాక్టివేట్ అవడంతో ఇది తెలిసింది. జన్యుపరంగా కవలల్లోనూ ఇలా పూర్తిగా మ్యాచ్ అవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక లోపమా, నిజంగానే బయోమెట్రిక్స్ సేమ్ ఉన్నాయా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

News November 17, 2025

WONDER: ఒకేలా ఇద్దరి ఫింగర్‌ప్రింట్స్!

image

ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. కానీ తొలిసారి UP కాన్పూర్‌లో కవలలు ప్రబల్, పవిత్ర మిశ్రాల ఫింగర్‌ప్రింట్లు, రెటీనా సరిపోలినట్లు తెలుస్తోంది. ఒకరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయగా మరొకరిది డియాక్టివేట్ అవడంతో ఇది తెలిసింది. జన్యుపరంగా కవలల్లోనూ ఇలా పూర్తిగా మ్యాచ్ అవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక లోపమా, నిజంగానే బయోమెట్రిక్స్ సేమ్ ఉన్నాయా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

News November 17, 2025

14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. PGT(2,996), ప్రైమరీ టీచర్(2,684), TGT(6,215), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(1,312)తో పాటు మరికొన్ని ఉద్యోగాలున్నాయి. ఈ జాబ్స్‌కు CBSE తొలుత ఉమ్మడి పరీక్ష నిర్వహించనుంది. రెండో దశలో పోస్టులను బట్టి ఎగ్జామ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్టుతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ DEC 4.
* వెబ్‌సైట్: <>https://www.cbse.gov.in/<<>>