News April 4, 2025

సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: NRPT కలెక్టర్ 

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం నర్వ మండల కేంద్రంలోని చౌకధర దుకాణంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని చెప్పారు.

Similar News

News November 4, 2025

సమానత్వం అప్పుడే ఎక్కువ

image

మహిళలు అనునిత్యం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల సమానత్వం అన్నది పుస్తకాలకే పరిమితమైంది. అయితే పురాతన కాలంలోనే ఈజిప్టు మహిళల్ని పురుషులతో సమానంగా పరిగణించేవారట. వాళ్లకంటూ సొంత ఆస్తులు, విడాకులు తీసుకునే హక్కులతోపాటు మత, రాజకీయ పదవులూ కలిగి ఉండేవారని తొలి పురావస్తు రికార్డులు చెబుతున్నాయి.

News November 4, 2025

విజయవాడ: నాగవైష్ణవి హత్య కేసు.. అతడిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్ట్

image

విజయవాడలో 2010లో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో A3 నిందితుడిగా ఉన్న బాలిక మావయ్య పంది వెంకటరావు/కృష్ణకు భారీ ఊరట లభించింది. అతడికి కింది కోర్టు గతంలో జీవితఖైదు విధించగా హైకోర్టులో అప్పీల్ చేసుకోగా సోమవారం కేసు విచారణకు వచ్చింది. చిన్నారి హత్యలో కృష్ణ పాత్ర ఉన్నట్లు సాక్ష్యాలు లేవంటూ అతడి తరఫు లాయర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం జీవితఖైదును రద్దు చేసి నిర్దోషిగా ప్రకటించింది.

News November 4, 2025

ఇల్లందుకు బొగ్గుగడ్డగా పేరేలావచ్చిందంటే!

image

1870లో ఇల్లందులో బొగ్గు నిల్వలు బయటపడ్డాయి. అప్పటి నుంచి స్థానికులు ఇల్లందును ‘బొగ్గుగడ్డ’గా పిలుస్తుంటారు. భద్రాద్రి రామయ్య భక్తుడి కారణంగా నల్ల బంగారం వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఎడ్లబండిపై రాములోరి గుడికి వెళ్తూ రాత్రి సమయంలో సింగరేణి, పూసనపల్లి సమీపంలో వంట కోసం అక్కడ నల్లటి రాళ్లను పొయ్యిగా అమర్చారు. రాళ్లు నిప్పు కణికలుగా మారడం, ఎంతకీ ఆరకపోవడంతో దక్కన్ కంపెనీ నిల్వలను గుర్తించింది.