News April 5, 2025

సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే కేఆర్

image

పర్వతగిరి మండలం రావూరు గ్రామానికి చెందిన బండి లావణ్య-రమేశ్ ఆహ్వానం మేరకు వారి ఇంట్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం భోజనం చేశారు. సన్న బియ్యం పథకం అమలు కావడంతో ప్రతి పేదవాడు కడుపు మార్చుకోకుండా ఉంటున్నాడని పేర్కొన్నారు. పేదల కోసం తెచ్చిన ఈ పథకం ఘనత సీఎం రేవంత్ రెడ్డికే చెందుతుందని ఆయన చెప్పారు. 

Similar News

News December 5, 2025

నల్గొండ: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం అందాలి: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం (స్కాలర్‌షిప్‌) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్‌‌లో ఎంఈఓలు, సంక్షేమ శాఖల అధికారులతో ఆమె పాఠశాల విద్యార్థుల స్కాలర్‌షిప్‌ మంజూరుపై సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, ఏ ఒక్క పేద విద్యార్థి కూడా స్కాలర్‌షిప్‌ కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News December 5, 2025

MBNR: ఎన్నికల వేళ… జోరందుకున్న దావత్‌లు!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విందు, వినోద కార్యక్రమాలు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు సమాచారం. పల్లెల్లో నేతలు, అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు.

News December 5, 2025

ఉమ్మడి జిల్లా HMలతో ITDA ఇన్‌ఛార్జ్ PO సమావేశం

image

మెనూ అమలు బాధ్యత HMలదేనని ITDA ఇన్‌ఛార్జ్ PO యువరాజ్ మార్మాట్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల HMలు, సంక్షేమ అధికారులు, డిప్యూటీ వార్డెన్లతో ఉట్నూర్‌లో సమావేశం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, నూతన మెనూ అమలులో చిన్నపాటి ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.