News February 9, 2025

సన్న బియ్యం సరఫరా చేసే ఆలోచనలో ప్రభుత్వం: అనిత

image

రాష్ట్రంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సన్న రకం వరి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.

Similar News

News April 5, 2026

రేవల్లి: 9న గొల్లపల్లి- చీర్కపల్లికి హరీష్ రావు రాక

image

రేవల్లి మండలంలోని గొల్లపల్లి- చిర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా అఖిలపక్ష పోరాట సమితి దీక్షలకు సంఘీభావం తెలపడానికి మాజీ మంత్రి హరీశ్ రావు రానున్నారని చెప్పారు. ప్రజాధనాన్ని లూటీ చేయడానికి ప్రభుత్వం ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపడుతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.

News April 5, 2026

8న చెరువుగట్టు ఆలయ టెండర్ల వేలం

image

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన వివిధ టెండర్ల బహిరంగ వేలం ఈనెల 8న (బుధవారం) జరగనుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు గట్టుపై ఉన్న ఈవో కార్యాలయం వద్ద వేలం నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 8 వరకు వర్తించే ఈ వేలం ప్రక్రియలో ఆసక్తి గలవారు పాల్గొనాలని ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

News April 5, 2026

నల్గొండ: మందులేదు.. టీకానే శ్రీరామరక్ష!

image

పశువులకు సోకే గాలికుంటు అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. వైరస్ వల్ల వచ్చే ఈ రోగానికి ప్రత్యేకమైన మందు లేదు. వ్యాధి సోకితే కేవలం లక్షణాలను బట్టి గాయాలు కడగడం, యాంటీ బయాటిక్స్ వాడటం, మెత్తటి మేత పెట్టడం మాత్రమే చేయగలం. దీంతో పశువులు తీవ్రంగా ఇబ్బంది పడతాయి. అందుకే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు నిరోధక టీకాలను రైతులు తమ పశువులకు తప్పనిసరిగా వేయించి కాపాడుకోవాలి.