News March 31, 2025

సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు

image

ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 16వ వార్డులోని రేషన్ షాపులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఆర్డీవో రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

Similar News

News November 21, 2025

శబరిమలై యాత్రికుల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: డీటీవో

image

శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డ్రైవర్లు మెళకువలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సూచించారు. శబరిమలై యాత్రికులతో ఆర్టీసీ, ట్రావెల్స్ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు జిల్లా నుంచి తరలి వెళ్తున్నందున డ్రైవర్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. మంచు కురిసే సమయాల్లో డ్రైవింగ్ చేయవద్దని, సుదూర ప్రయాణాల్లో తప్పనిసరిగా వాహనంలో ఇద్దరు డ్రైవర్లు ఉండాలని ఆయన ఆదేశించారు.

News November 21, 2025

NZB: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి: TWJF

image

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని TWJF నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రాల్లోని విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. దాడుల నుంచి జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రామచందర్ రెడ్డి, రాజు, పరమేశ్వర్, భాస్కర్, ప్రవీణ్, అనిత తదితరులు పాల్గొన్నారు.

News November 21, 2025

వర్షాలు పడే అవకాశం పంటలు జాగ్రత్త: కలెక్టర్

image

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈ నెల 27, 28న వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. నూర్పిడి జరిగిన పంటలు, కోతలు కోసిన పంటలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆమె రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు సహకరించాలని, ధాన్యం వర్షానికి తడవకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు.