News March 31, 2025
సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 16వ వార్డులోని రేషన్ షాపులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఆర్డీవో రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
Similar News
News December 16, 2025
పంచాయతీ పోలింగ్కు పటిష్ఠ భద్రత: ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి: మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 1288 పోలింగ్ కేంద్రాల్లో 1500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News December 16, 2025
రంగరాయ వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణాలకు నిధులు ఇవ్వాలి: ఎంపీ ఉదయ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాలలో హాస్టల్ నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం పార్లమెంటులో ఆయన మాట్లాడారు. హాస్టల్ భవనాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని గుర్తు చేశారు. పీజీ లేడీస్ హాస్టల్ పనులు 35%, మెన్స్ హాస్టల్ పనులు కేవలం 15% మాత్రమే పూర్తయ్యాయని, వెంటనే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
News December 16, 2025
సిరిసిల్ల: ‘కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి’

కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రజిత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ రజిత మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి జిల్లాలో ఇంటింటా కుష్ఠు వ్యాధి గుర్తింపు నిర్వహిస్తామన్నారు.


