News February 4, 2025

సబ్బవరం: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

image

సబ్బవరం శివారు పెదనాయుడుపాలెంలో పూర్ణశేఖర్(22) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడు ఆదివారం రాత్రి ఇంటిలో భోజనం చేసి బయటకు వెళ్లాడు. సోమవారం తల్లిదండ్రులు నారపాడు గోవింద,నాయుడమ్మ కల్లం వద్దకు వెళ్లి చూడగా పశువుల షెడ్డు వద్ద వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. తల్లి నాయుడమ్మ ఫిర్యాదు మేరకు పరవాడ డి.ఎస్.పి విష్ణు స్వరూప్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.

Similar News

News November 19, 2025

GHMC ఎన్నికలకు సిద్ధం కావాలి: KTR

image

ఓడిన చోటే గెలిచి చూపిద్దామని, GHMC ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సూచించారు. బుధవారం HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నేతలతో సమావేశం అయ్యారు. సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దొంగ ఓట్లు, అక్రమాలతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు.

News November 19, 2025

వికారాబాద్: జోరుగా కల్తీ కల్లు దందా.!

image

వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతుంది. మోతాదుకు మించి రసాయనాలు కలిపి తయారు చేస్తున్న ఈ కల్లును తాగుతున్న అమాయక ప్రజలు పేదలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి పరీక్షలు నిర్వహించాల్సిన జిల్లా అబ్కారీ అధికారులు ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అబ్కారీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News November 19, 2025

GHMC ఎన్నికలకు సిద్ధం కావాలి: KTR

image

ఓడిన చోటే గెలిచి చూపిద్దామని, GHMC ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సూచించారు. బుధవారం HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నేతలతో సమావేశం అయ్యారు. సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దొంగ ఓట్లు, అక్రమాలతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు.