News March 22, 2025
సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిని గుర్తించండి: షబ్బీర్ అలీ

మిషన్ భగీరథ పైప్లైన్ పనులను వేగవంతం చేసి మున్సిపల్ ఏరియాలో రోజుకు రెండుసార్లు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. పట్టణంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిని గుర్తించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రంజాన్ పండుగ సందర్భంగా నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News April 22, 2025
‘ఛావా’ మరో రికార్డ్

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ మరో రికార్డ్ సాధించింది. కేవలం హిందీలో రూ.600 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. గతంలో స్త్రీ-2, పుష్ప-2 ఈ ఘనత సాధించాయి. ఫిబ్రవరి 14న విడుదలైన ఛావా ఓవరాల్గా రూ.800 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం నెట్ప్లిక్స్లోనూ నంబర్-1 స్థానంలో స్ట్రీమింగ్ అవుతోంది. శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.
News April 22, 2025
‘ఫసల్ భీమా’ యోజన అమలు చేయాలి: ఎమ్మెల్సీ

తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ‘ఫసల్ భీమా’ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా రైతు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తక్షణమే తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన అమలు చేస్తే ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు మేలు జరుగుతుంది అంజిరెడ్డి అన్నారు.
News April 22, 2025
గిల్-సాయి జోడీ అదుర్స్

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అదరగొడుతున్నారు. తొలి వికెట్కు మంచి భాగస్వామ్యం నమోదు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్సుల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 448 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. ఈ ఏడాది ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో RCB నుంచి కోహ్లీ-సాల్ట్(315), SRH నుంచి హెడ్-అభిషేక్(314) ఉన్నారు.