News February 1, 2025

సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలి: బాపట్ల జేసీ

image

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ సభ్యత్వ నమోదు గురించి జిల్లా స్థాయి కమిటీ మీటింగ్ శనివారం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈ శ్రమ్ పోర్టల్‌లో సభ్యత్వ నమోదుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News November 12, 2025

విశాఖ: ‘వాహనదారులు నిబంధనలు పాటించాలి’

image

ఆటోరిక్షాలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, స్కూల్ పిల్లలను ఆరుగురుకి మించి తీసుకెళ్లకూడదని ఉప రవాణా కమీషనర్ ఆర్.సి.హెచ్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. CC బస్సులో, టూరిస్ట్ బస్సులలో అత్యవసర ద్వారానికి అడ్డంగా టైర్లు, లగేజిలు ఉంచకూడదన్నారు. విశాఖలో పార్ట్నర్‌షిప్ సమ్మిట్ జరుగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వాహనాలను నడపాలని సూచించారు.

News November 12, 2025

ఇసుక సరఫరాలో పారదర్శకత: నంద్యాల కలెక్టర్ ఆదేశాలు

image

నంద్యాల జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా, విక్రయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబరులో నిర్వహించిన ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు ఇసుక సులభంగా, సకాలంలో అందుబాటులో ఉండేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, అందరికీ సమానంగా ఇసుక అందేలా చూడాలని సూచించారు.

News November 12, 2025

కురుపాం గురుకులంలో జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ విచారణ

image

కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థుల మృతిపై బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ సమగ్రంగా విచారణ జరిపింది. కమిటీ సభ్యులు ఉదయం పాఠశాలకు చేరుకుని, అక్కడి వసతి గృహాలు, భోజనశాల, తరగతి గదులు, ఆరోగ్య సదుపాయాలు తదితర విభాగాలను అణువణువు పరిశీలించారు. మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి సమాచారం సేకరించారు.