News December 19, 2024

సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మెకు కేఏ పాల్ మద్దతు

image

కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట పది రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ మద్దతు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పది రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. 

Similar News

News September 15, 2025

‘గ్రామపాలనాధికారులు మెరుగైన సేవలు అందించాలి’

image

ఖమ్మం: గ్రామపాలనాధికారులు నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్, నూతనంగా నియమించిన గ్రామ పరిపాలన అధికారులకు సోమవారం పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. జిల్లాలో 299 క్లస్టర్లకు గాను 252 మంది అర్హులైన వారికి మెరిట్ ప్రకారం వారి సొంత మండలం మినహాయించి, ఇతర ప్రదేశాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు పోస్టింగ్ ఇచ్చామన్నారు.

News September 15, 2025

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: ఖమ్మం కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News September 15, 2025

పటిష్టం..’పాలేరు’

image

1928లో పాలేరు చెరువు నిర్మించారు. నాటీ చీఫ్ ఇంజీనీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో చతురస్రాకారం బండరాళ్లు, బంకమట్టి, డంగుసున్నం, కాంక్రీట్ లాంటి సీసంతో నిర్మించారు. చెరువు నుంచి నేటికీ చుక్క నీరు కూడా లీక్ కాకపోవడం నాటి ఇంజీనీర్ల ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. పాలేరు చెరువు 1978లో రిజర్వాయర్‌గా మారినప్పుడు ఇంజీనీర్లు ఫాలింగ్ గేట్లు ఏర్పాటు చేసి ఘనత సాధించారు. నేడు ఇంజీనీర్స్ డే.