News January 30, 2025

సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అడిషనల్ కో-ఆర్డినేటర్‌గా రామారావు

image

సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌గా రామారావును ఫుల్ అడిషనల్ చార్జ్ (FAC)గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన పార్వతీపురం మన్యం జిల్లాలో డా.వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఫారెన్ సర్వీసులో భాగంగా ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు ఇంఛార్జిగా భాధ్యతలు నిర్వహించారు.

Similar News

News November 30, 2025

VZM: ‘గురజాడ నివాసాన్ని జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలి’

image

గురజాడ అప్పారావు నివాసాన్ని జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రముఖ కవి తెలకపల్లి రవి, సామాజిక వేత్త దేవి డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలో గురజాడ వర్ధంతి సందర్భంగా జరిగిన గౌరవ యాత్రలో వారు పాల్గొన్నారు. గురజాడ ప్రపంచానికి తెలుగు భాష ఔనిత్యాన్ని చాటి చెప్పిన మహా కవి అన్నారు. గురజాడ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.

News November 30, 2025

2వేల టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాం: VZM కలెక్టర్

image

ఒక వేళ వర్షాలు పడితే ధాన్యం పాడవ్వకుండా 2వేల టార్పాలిన్లు సిద్ధంగా ఉంచామని రాం సుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో నేడు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మరో 1600 టార్పాలిన్లు జిల్లాకు రానున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. చీపురుపల్లి, బొబ్బిలి డివిజన్లలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని, విజయనగరం డివిజన్లో త్వరలో ప్రారంభమవుతుందన్నారు.

News November 30, 2025

ఎక్కువ కేసులు పరిష్కరించాలి: SP

image

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌కు ముందే ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ దామోదర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. నాన్ బెయిలబుల్ వారంట్ల అమలుకు ప్రత్యేక బృందాలు, దర్యాప్తులో ఈ-సాక్ష్య యాప్ తప్పనిసరన్నారు. సిసిటీఎన్ఎస్‌లో కేసుల అప్లోడింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.