News October 29, 2024
సమగ్ర సర్వేకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ సంతోష్

నవంబర్ 4 నుంచి 17 వరకు జిల్లాలో చేపట్టే సమగ్ర సర్వేకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో సంబంధిత అధికారుల తో సమావేశం నిర్వహించారు. సర్వే కొరకు ఎన్యూమరేటర్లు, ఎన్యూమరేటర్ల బ్లాకులు, హౌస్ లిస్ట్ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. మండలం వారిగా ఎంపీడీవో తహశీల్దార్, మునిసిపాలిటీలో కమిషనర్లు ఎన్యూమరేటర్లను నియమించుకోవాలన్నారు.
Similar News
News December 12, 2025
రాజాపూర్: MLA అహంకారానికి హెచ్చరిక: ఎంపీ

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలుకావడం ఆయన అహంకారానికి ప్రజలు ఓటుద్వారా చేసిన హెచ్చరిక అని ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డిగూడెంలో సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఆనంద్ రేవతిని ఎంపీ అభినందిస్తూ, శాలువాతో సన్మానించారు. గ్రామాభివృద్ధికి భవిష్యత్తులో మరింత కృషిచేయాలని సూచించారు. తన పూర్తి సహకారం ఉంటుందని డీకే అరుణ హామీ ఇచ్చారు.
News December 12, 2025
MBNR: వాహనదారులు, ప్రజలకు భద్రతా సూచనలు: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లాలో శీతాకాలం తీవ్రం కావడంతో రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా ఏర్పడుతోంది. దీంతో విజిబిలిటీ తగ్గి ప్రమాదాలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఉదయం 5 నుంచి 8, రాత్రి 8 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, వాహనదారులు, వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
News December 12, 2025
MBNR : భూత్పూర్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.


