News August 10, 2024
సమత ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు

విశాఖ నుంచి వయా విజయనగరం మీదుగా వెళ్లే విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ను దారి మళ్లించారు. రెగ్యులర్గా ఈ రైలు విజయనగరం, పార్వతీపురం, రాయగడ, రాయపూర్ మీదుగా నిజాముద్దీన్ వెళ్తుంది. అనివార్య కారణాల వల్ల 12807 నంబర్తో నడిచే ఈ రైలు శనివారం విజయవాడ మీదుగా నిజాముద్దీన్ వెళ్లనుంది. శనివారం ఉదయం 9.20 నిమిషాలకు ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని అధికారులు కోరారు.
Similar News
News October 26, 2025
రైతులను అప్రమత్తం చేయండి: కలెక్టర్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వరి పంటకు నష్టం జరగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం సూచించారు. వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశముందని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.
News October 26, 2025
విజయనగరంలో 4 ప్రైవేట్ బస్సులు సీజ్

నగరంలో రవాణా శాఖాధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపరవాణా కమిషనర్ మణికుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లతో కలసి వాహన రికార్డులు, ఫైర్ ఎక్విప్మెంట్, సీటింగ్ బెర్త్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని 4 వాహనాలను సీజ్ చేసి ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు.
News October 26, 2025
VZM: జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు

తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
కలెక్టర్ ఆఫీస్: 08922-236947, 8523876706
VZM రెవెన్యూ డివిజినల్ ఆఫీస్: 8885893515
చీపురుపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్: 9704995807
బొబ్బిలి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్: 9989369511
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్: 9849906486
AP EPDCL: 9490610102
టోల్ ఫ్రీ నంబర్ 1912ని సంప్రదించాలన్నారు.


