News February 7, 2025

సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలి: WGL ట్రాఫిక్ ఏసీపీ

image

ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ ట్రాఫిక్ నియంత్రణ చేయాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. గురువారం ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ అధికారులతో సమావేశయ్యారు. ఈ సమావేశంలో అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్, జరిమానాలు విధించే సమయం, ట్రాఫిక్ నియంత్రణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏసీపీ అధికారులకు సూచించారు.

Similar News

News March 20, 2025

వరల్డ్ బెస్ట్ బ్రెడ్ మన ఇండియాదే!

image

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ మార్చి-2025 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో భారతదేశపు ‘బటర్ గార్లిక్ నాన్’ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రెడ్‌గా నిలిచింది. ఇది 4.7 రేటింగ్‌తో ప్రథమ ర్యాంకును పొందింది. ఆ తర్వాత అమృత్‌సర్‌కు చెందిన ‘కుల్చా’కు రెండు, పరోటాకు ఆరో స్థానం లభించింది. కాగా, 8వ ర్యాంకులో ‘నాన్’, 18లో ‘పరాఠా’, 26లో ‘భతురా’, 28లో ‘ఆలూ నాన్’, 35 ర్యాంకులో ‘రోటీ’ ఉన్నాయి.

News March 20, 2025

పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ప్రతీక్

image

పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి డీఈవో రేణుక దేవితో కలిసి కలెక్టర్ పరీక్షల నిర్వహణ అధికారులతో తహసీల్దారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఎలాంటి మాస్ కాఫింగు అవకాశం లేకుండా చూడాలన్నారు.

News March 20, 2025

రేపు కరీంనగర్‌కు రైల్వే జీఎం రాక

image

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శుక్రవారం కరీంనగర్ రానున్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద కరీంనగర్, రామగుండం రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం జీఎం అరుణ్ కుమార్ ప్రత్యేక రైలులో ఉన్నత అధికారులతో కలిసి ఉదయం 8:30 గంటలకు కరీంనగర్ చేరుకుని రైల్వేస్టేషన్ను తనిఖీ చేసి, అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం మ.1:00 వరకు రామగుండం వెళ్ళనున్నారు.

error: Content is protected !!