News January 29, 2025

సమన్వయంతో విధులు నిర్వహించాలి: సీపీ అనురాధ

image

పోలీస్ అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సిద్దిపేట వన్ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్ కార్యాలయాలను సీపీ సందర్శించారు. స్టేషన్ పరిసర ప్రాంతాలు, సీజ్ చేసిన వాహనాలు పరిశీలించారు. మొక్కలు నాటారు. ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించి మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News October 23, 2025

శ్రీ దుర్గా మృతిపై విచారణకు కమిటీ ఏర్పాటు

image

గొల్లప్రోలు(M) చేబ్రోలుకు చెందిన బాలింతరాలు శ్రీ దుర్గా వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందడంపై DyCM పవన్ కళ్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో KKD కలెక్టర్ షాన్‌మోహన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి, పాడా పీడీ చైత్ర వర్షిణి, గైనిక్ హెచ్‌ఓడీ తదితరులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దర్యాప్తు నివేదికను కలెక్టర్‌కు సమర్పించనుంది.

News October 23, 2025

అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు : నెల్లూరు ఎస్పీ

image

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి 25వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దని ఎస్పీ డా అజిత వేజెండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. సముద్ర తీర పర్యాటకం నిషేధించామని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. పాత ఇళ్లల్లో జాగ్రత్తగా ఉండాలని, తడిచిన చేతులతో విద్యుత్ వస్తువులు తాకరాదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు.

News October 23, 2025

ఈ నెల 24న జాబ్ మేళా..2,000కి పైగా ఉద్యోగాల భర్తీ

image

APSSDC, సీడాప్ ఆధ్వర్యంలో మైలవరం లక్కిరెడ్డి హనిమిరెడ్డి కళాశాలలో ఈ నెల 24న జాబ్ మేళా జరగనుంది. 28 కంపెనీలు హాజరయ్యే ఈ జాబ్ మేళాకు SSC, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, పీజీ, బీటెక్ చదివిన 18- 50 ఏళ్లలోపు వయస్సున్న అభ్యర్థులు హాజరు కావొచ్చని నిర్వాహకులు తెలిపారు. అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registrationలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎంపికైనవారికి నెలకు 10- 45 వేల వేతనం ఉంటుందన్నారు.