News July 26, 2024
సమష్టిగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకొద్దాం: ఎస్పీ

సమష్టిగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచిపేరు తేవాలని ఎస్పీ కేవీ మురళీకృష్ణ అన్నారు. అనంతపురంలోని పరేడ్ మైదానంలో శుక్రవారం ఏఆర్ సాయుధ బలగాలు, హోంగార్డులు నిర్వహించిన పరేడ్ను ఎస్పీ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడాతూ.. పరేడ్ బాగా చేశారన్నారు. యూనిఫాం సర్వీస్లో ఏఆర్, హోంగార్డులు, సివిల్ పోలీసులతో పాటు ప్రాధాన్యతగా సేవలు అందిస్తున్నారన్నారు.
Similar News
News October 15, 2025
ఈనెల 17 నుంచి జిల్లాస్థాయి సైన్స్ సెమినార్

అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఈనెల 17 నుంచి జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు డీఈవో ప్రసాద్ బాబు, సైన్స్ సెంటర్ క్యూరేటర్ బాల మురళీకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం మండల స్థాయిలో సెమినార్ నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామన్నారు.
News October 15, 2025
అనంతలో కేరళ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన

కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం జాతీయ అధ్యక్షుడు పీకే, ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధవాలే అనంతపురం నగరానికి విచ్చేశారు. అనంతపురంలో ఉన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ప్రజా సమస్యలపై సింధూర అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించాలన్నారు.
News October 14, 2025
స్నేహితుడిని రాయితో కొట్టి చంపిన వ్యక్తి అరెస్ట్

గుంతకల్లు 2 టౌన్ PS పరిధిలో స్నేహితుడు ఆనంద్(30) హత్య కేసులో నిందితుడు సయ్యద్ సలీంను (తిలక్ నగర్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న తెల్లవారుజామున బస్టాండ్లో మద్యం తాగుతున్న సమయంలో సలీం కుటుంబాన్ని ఆనంద్ దుర్భాషలాడటంతో ఆగ్రహించిన సలీం.. ఆనంద్ను రాయితో తలపై కొట్టి హత్య చేసీనట్లు టూ టౌన్ ఇన్ఛార్జ్ సీఐ మనోహర్ వెల్లడించారు. సలీంను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు.