News December 8, 2024
సమష్టి కృషితో డ్రగ్స్ భూతాన్ని పారదోలుదాం: ఎస్పీ

సమష్టి కృషితో డ్రగ్స్ అనే భూతాన్ని సమాజం నుంచి పారదోలుదామని జిల్లా ఎస్పీ రత్న ఐపిఎస్ పేర్కొన్నారు. శనివారం ధర్మవరం బీఎస్ఆర్ బాలికల పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్కు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజాన్ని విద్యార్థులను యువతను డ్రగ్స్ అనే భూతం పట్టి పీడిస్తోందని అందరి కృషితో సమాజం నుంచి పారదోలుదాం అన్నారు.
Similar News
News October 27, 2025
అనంతపురంలో దారుణం.. బాలుడిని చంపిన వ్యక్తి

అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అరుణోదయ కాలనీలో సుశాంత్(5) అనే బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చినట్లు సమాచారం. అయితే ఆదివారం తమ బాలుడు కనిపించడం లేదని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 27, 2025
రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్లో సత్తాచాటిన క్రీడాకారులు

కర్నూలులో ఏపీ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో జిల్లా క్రీడాకారులు రాణించారు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ.. సంతోష్కు అండర్-6లో 4వ స్థానం, వెనీషాకు బాలికల -12లో 4వ స్థానం, నితీష్కు -14లో 5వ స్థానం, జనని ఎఫ్-10లో 8వ స్థానం సాధించారన్నారు. విజేతలకు టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కామిశెట్టి బహుమతులు అందించారు.
News October 26, 2025
యాడికి: బైక్ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

యాడికి మండలం రాయలచెరువులోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన పుల్లయ్య మోడల్ స్కూల్లో వాచ్మెన్గా పనిచేసే పుల్లయ్య మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి నుంచి బైక్పై మోడల్ స్కూల్కు బయలుదేరాడు. వెనుక నుంచి బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో పుల్లయ్య మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


