News December 17, 2024

సమస్యలను త్వరగా పరిష్కారించాలి: కడప JC

image

సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు త్వరగా పరిష్కారం అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింఘ్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల ద్వారా, సోమవారం ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులను సత్వరమే విచారించి న్యాయం చేయాలన్నారు.

Similar News

News October 25, 2025

రాజుపాలెం: కుందూనదిలో దంపతుల ఆత్మహత్యాయత్నం?

image

రాజుపాలెం మండలంలోని వెళ్లాల సమీపంలోని కుందూ నదిలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భార్యాభర్తలు గొంగటి రామసుబ్బారెడ్డి, నాగ మునెమ్మ పడ్డారు. గమనించిన స్థానికులు నదిలో కొట్టుకుపోతున్న భర్తను రక్షించి ఒడ్డుకు చేర్చారు. నాగ మునెమ్మ గల్లంతయారు. ఆమె కోసం గజఈత గాళ్ల సహాయంతో పోలీసులు గాలిస్తున్నారు. వీరు పెద్దముడియం మండలంలోని ఉప్పులూరుకు చెందిన వారిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 25, 2025

కడప: ఒక్కరోజే 950 మందిపై కేసు..!

image

కడప జిల్లా ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో 219 ద్విచక్రవాహనాలు, 21 ఆటోలు, ఒక గూడ్స్ ఆటో, 950 మందిపై మోటారు వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను రూ .2,449,50 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వాహన సేఫ్టీపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.

News October 25, 2025

కడప జాయింట్ కలెక్టర్‌కు మరో బాధ్యత

image

కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కుడా) వైస్ ఛైర్మన్‌గా జేసీ అతిథి సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు అథారిటీలకు జాయింట్ కలెక్టర్లను నియమించారు. కడప జిల్లాకు జేసీ అతిథి పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు.