News March 10, 2025
సమస్యలను పరిష్కరించండి: కర్నూలు జిల్లా కలెక్టర్

పీజీఆర్ఎస్ ద్వారా తీసుకున్న అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ బి.నవ్యతో కలిసి ఆయన వినతులను స్వీకరించారు. అధికారులు క్షేత్రస్థాయిలోని ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని అన్నారు.
Similar News
News March 20, 2025
ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంత నిరసన

ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంత గురువారం నిరసన చేపట్టారు. పట్టణంలోని కోట్ల విగ్రహం వద్ద నిరాహార దీక్షకు పూనుక్కున్నారు. ఏ తప్పు చేయకున్నా అవిశ్వాస తీర్మానం పెట్టాలని కౌన్సిలర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం తగదన్నారు. నాలుగేళ్ల పాటు నిజాయితీగా ఉంటూ వైసీపీలోనే కొనసాగుతున్నన్నారు. ఆ పార్టీ కౌన్సిలర్లే పదవి దింపాలని చూడటం సమంజసం కాదని అన్నారు. న్యాయం చేయాలని మాజీ సీఎం జగన్ను కోరుతామని తెలిపారు.
News March 20, 2025
కర్నూలు: ఈవీఎం వేర్ హౌస్ను పరిశీలించిన కలెక్టర్

త్రైమాసిక తనిఖీలో భాగంగా ఈవీఎంలు భద్రపరచిన వేర్ హౌస్ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ ఆవరణలోని ఈవిఎం వేర్ హౌస్లో ఈవీఎంలను భద్రపరచిన తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఈవీఎంలను భద్రతపై నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News March 19, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤హత్తిబెళగల్ వీఆర్వోపై కర్నూలు జేసీ నవ్య ఆగ్రహం ➤ కూటమి ప్రభుత్వంపై ఆలూరు ఎమ్మెల్యే ఫైర్ ➤ జగన్, కేసీఆర్ తోడు దొంగలు, ఆర్థిక నేరగాళ్లు: బైరెడ్డి ➤ లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..! ➤ కోడుమూరు: వైసీపీ నాయకుడి మృతి ➤ ప్రజల మనసులో నుంచి వైఎస్ఆర్ను తొలగించలేరు: ఎస్వీ ➤ ప్రభుత్వాసుపత్రిలో అన్ని వైద్య సేవలు అందించాలి: ఆదోని ఎమ్మెల్యే