News February 18, 2025

సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి: ఎస్పీ

image

చట్ట పరిధిలోని సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీసులను ఆదేశించారు. రాయచోటిలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కారవేదిక’ కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

Similar News

News November 21, 2025

నర్సంపేట: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష

image

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న పట్టణంలోని అంగడి సెంటర్‌లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటో నడుపుతున్న పట్టణానికి చెందిన మేకల మహేందర్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు మహేందర్‌ను నర్సంపేట న్యాయస్థానంలో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.

News November 21, 2025

వేములవాడ బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన 50 మంది

image

వేములవాడ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు, వేములవాడ ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సరిపల్లి కార్తీక్, లిక్కి జితేందర్ ఆధ్వర్యంలో వారి మిత్రబృందం మొత్తం 50 మంది శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

News November 21, 2025

నిరంతర తనిఖీలు చేయాలి: మంత్రి

image

రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలు మరింత కఠినతరం చేసేలా ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం కొత్తగా ఏర్పడిన 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలని సూచించారు.