News June 4, 2024
సమస్యలు పరిష్కరిస్తా: ఈటల రాజేందర్

భారీ మెజార్టీతో గెలిపించిన మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధి హోలీ మేరీ కళాశాలలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News November 18, 2025
HYD: మీ బండిలో ఇంజిన్ ఆయిల్ పోయిస్తున్నారా?

HYDలో నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా రోజురోజుకూ పెరుగుతోంది. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కొందరి బండి ఇంజిన్ త్వరగా వేడెక్కుతోందని, పొగవస్తోందని ఆరా తీయగా గుట్టు బయటపడింది. ఈ ఆయిల్తో బండి త్వరగా బోర్కు వస్తుందని, క్లచ్లో తేడా గమనిస్తే మెకానిక్ను సంప్రదించాలని నిపుణుల చెబుతున్నారు. నమ్మకమైన చోట బండి సర్విసింగ్కు ఇవ్వాలని, ఆయిల్ కొనాలని సూచించారు. తేడావస్తే ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు పేర్కొన్నారు.
News November 18, 2025
HYD: మీ బండిలో ఇంజిన్ ఆయిల్ పోయిస్తున్నారా?

HYDలో నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా రోజురోజుకూ పెరుగుతోంది. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కొందరి బండి ఇంజిన్ త్వరగా వేడెక్కుతోందని, పొగవస్తోందని ఆరా తీయగా గుట్టు బయటపడింది. ఈ ఆయిల్తో బండి త్వరగా బోర్కు వస్తుందని, క్లచ్లో తేడా గమనిస్తే మెకానిక్ను సంప్రదించాలని నిపుణుల చెబుతున్నారు. నమ్మకమైన చోట బండి సర్విసింగ్కు ఇవ్వాలని, ఆయిల్ కొనాలని సూచించారు. తేడావస్తే ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు పేర్కొన్నారు.
News November 18, 2025
HYDలో టైఫాయిడ్, ఊపిరితిత్తుల కేసులు

HYDలో టైఫాయిడ్, ఊపిరితిత్తుల కేసులు పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రుల్లో 15 రోజుల్లోనే 18 మందికిపైగా టైఫాయిడ్, డయేరియా, శ్వాస సంబంధిత రుగ్మతలతో అడ్మిట్ అయినట్లు అధికారులు తెలిపారు. జ్వరం, తలనొప్పి, అలసట, కడుపునొప్పి, విరేచనాలు, శరీరంపై దద్దుర్లు ఉంటే ఆస్పత్రికి వెళ్లాలి. కాచి చల్లార్చిన నీళ్లు, మసాలా దినుసుల కషాయం తాగటం, ముక్కులోకి చల్లగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు.


