News February 5, 2025

సమిష్టి పోరాటంతోనే క్యాన్సర్ నియంత్రణ: మంత్రి సత్యకుమార్

image

ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సమిష్ఠి పోరాటంతోనే క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించడం సాధ్యమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి ప్రపంచంలోని అన్ని దేశాలకూ పెను సవాలుగా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో 17.5 శాతం మేర కేవలం క్యాన్సర్ వ్యాధి కారణంగానే సంభవిస్తున్నాయని ఆయన వివరించారు.

Similar News

News November 16, 2025

బీజేపీకి ఓటు వేస్తేనే హిందువులా?.. MLAపై నెటిజన్ల ఫైర్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఓడిపోయాం అంతే చచ్చిపోలేదు. బీజేపీకి ఓటు వేసిన 17,056 మంది కట్టర్ హిందూ బంధువులకు ధన్యవాదాలు. కనీసం మీరైనా హిందువులుగా బతికి ఉన్నందుకు గర్వపడుతున్నా. జై హిందుత్వ’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేస్తేనే హిందువులా.. ఓటు వేయకుంటే హిందువులు కాదా? అని నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.

News November 16, 2025

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన ఇషా

image

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ అమ్మాయి ఇషా సింగ్‌ కాంస్యంతో మెరిసింది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్‌ పిస్టల్‌ విభాగంలో ఇషా 30 పాయింట్లు సాధించి 3వస్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్లో 587 పాయింట్లు సాధించి అయిదో స్థానంతో ఫైనల్‌కు వచ్చిన ఇషా తుదిపోరులో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇషాకు ఇదే తొలివ్యక్తిగత పతకం. ఈ ఏడాది ప్రపంచకప్‌ స్టేజ్‌ టోర్నీలో ఆమె స్వర్ణం, రజతం సాధించింది.

News November 16, 2025

శంషాబాద్: విమానంలో స్మోకింగ్ చేసిన ప్రయాణికుడు

image

విమానంలో పొగ తాగిన ప్రయాణికుడిని ఎయిర్ లైన్స్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాలు.. రియాద్ నుంచి ఇండిగో విమానంలో శనివారం ఓ ప్రయాణికుడు శంషాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో విమానంలోని మరుగుదొడ్డిలో పొగ తాగినట్లు ఎయిర్‌లైన్స్ సిబ్బంది గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.