News June 12, 2024
సముద్ర స్నానానికి వెళ్లి యువకుడి గల్లంతు

వేటపాలెం మండలం రామాపురం బీచ్లో విషాదం చోటుచేసుకుంది. చెన్నైలోని ఎంజీఆర్ యూనివర్సిటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న కనగళ్ల గౌరీశ్ (21) రామాపురం బీచ్లో సరదాగా గడిపేందుకు స్నేహితులతో కలిసి వచ్చాడు. సముద్ర స్నానాలు చేస్తుండగా అలలు తాకిడికి గౌరీశ్ గల్లంతయ్యాడు. కొద్దిసేపటికి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 1, 2025
నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News December 1, 2025
నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News November 30, 2025
తుఫాను ప్రభావం పడే 14 మండలాలు ఇవే.!

ప్రకాశం జిల్లాలోని 14 మండలాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ రాజబాబు అన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూతలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.


