News February 14, 2025
సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న ఎస్పీ

ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, డీఎస్పీ రవీందర్, క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ కిషోర్ కుమార్, సీఐలు శంకర్, రవీందర్ వన దేవతలను దర్శించుకున్నారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే సారె సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఎస్పీతో పోలీస్ అధికారులను పూజారులు, ఎండోమెంట్ అధికారులు శాలువాతో సన్మానించి అమ్మవారి ప్రసాదం అందించారు.
Similar News
News October 18, 2025
బనకచర్లపై స్టేటస్ తెలపాలని గోదావరి బోర్డు లేఖ

AP: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ వాస్తవ స్థితి తెలియజేయాలని గోదావరి బోర్డు రాష్ట్ర జలవనరుల శాఖకు లేఖ రాసింది. లింక్ ప్రాజెక్టుల ప్రతిపాదనలపై తెలంగాణ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు వివరణ ఇవ్వాలని కోరింది. ఇటీవల బనకచర్ల డీపీఆర్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటీస్ ఇచ్చింది. దీనిపై TG జలవనరుల శాఖ అభ్యంతరం తెలుపుతూ బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
News October 18, 2025
HYD: ‘పిల్లలు ఎలా పుడతారో తెలుసా’అనడంతో విచారించిన టీచర్

సైదాబాద్ PS పరిధిలో <<18037331>>ముగ్గురు బాలికలపై<<>> ఓ యువకుడు లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. స్థానికుల కథనం మేరకు.. లైంగిక దాడి అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తానని యువకుడు వారిని బెదిరించాడు. సెలవుల తర్వాత పిల్లలు స్కూల్కు వెళ్లారు. తమ తోటి వారితో ‘పిల్లలు ఎలా పుడతారో తెలుసా’ అంటూ వారు మాట్లాడుతుంటే క్లాస్ టీచర్ విని విచారించింది. దీంతో లైంగిక దాడి విషయం వారు చెప్పగా టీచర్, పేరెంట్స్ PSలో ఫిర్యాదు చేశారు.
News October 18, 2025
HYD: ‘పిల్లలు ఎలా పుడతారో తెలుసా’ అనడంతో విచారించిన టీచర్

సైదాబాద్ PS పరిధిలో <<18037331>>ముగ్గురు బాలికలపై<<>> ఓ యువకుడు లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. స్థానికుల కథనం మేరకు.. లైంగిక దాడి అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తానని యువకుడు వారిని బెదిరించాడు. సెలవుల తర్వాత పిల్లలు స్కూల్కు వెళ్లారు. తమ తోటి వారితో ‘పిల్లలు ఎలా పుడతారో తెలుసా’ అంటూ వారు మాట్లాడుతుంటే క్లాస్ టీచర్ విని విచారించింది. దీంతో లైంగిక దాడి విషయం వారు చెప్పగా టీచర్, పేరెంట్స్ PSలో ఫిర్యాదు చేశారు.