News March 15, 2025
సమ్మర్ ఎఫెక్ట్… జూ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు

ఎండలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో జూ పార్క్ అధికారులు జంతువుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంక్లోజర్ల వద్ద స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్ ఏర్పాటు చేశారు. పక్షులు ఇబ్బంది పడకుండా వాటి చుట్టూ గడ్డి ఏర్పాటు చేశారు. బాతుల రక్షణకు షేడ్ నెట్స్ ఉపయోగిస్తున్నారు.
Similar News
News February 9, 2026
GHMC 3 ముక్కలు.. బాస్ ఆయనే!

GHMCని 3 ముక్కలు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. HYD, CYB, మల్కాజిగిరి వేర్వేరు కార్పొరేషన్లు కొలువుదీరనున్నాయి. ‘స్పెషల్ ఆఫీసర్’గా Special CS జయేశ్ రంజన్ను రంగంలోకి దించుతోంది. సైబరాబాద్ కార్పొరేషన్ పగ్గాలు పి.సృజనకు, మల్కాజిగిరి బాధ్యతలు వినయ్ కృష్ణారెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ ప్రధాన కమిషనర్గా RV కర్ణన్ చక్రం తిప్పనున్నారు. రేపు GO విడుదల కానుందని సమాచారం.
News February 9, 2026
HYDలో బండిపోతే ‘బండి’.. ఏమైంది బండి?: CM

నగరంలో వరదలు వస్తే లోతట్టు ఇళ్లు, వాహనాలు మునిగిపోతాయని CM రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోమవారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. వరదల సమస్యను ప్రచారంలో వాడుకున్న బండి సంజయ్ గత GHMC ఎన్నికల్లో దాదాపు 50 మందిని గెలిపించుకున్నారని పేర్కొన్నారు. కానీ, ‘బండి పోతే బండి ఇస్తాం’ అన్న సంజయ్ ఆ హామీని నీరు గార్చారని, BJPకి ఓటేస్తే హైదరాబాదీలను నిండా ముంచారని రేవంత్ తీవ్రంగా విమర్శించారు.
News February 9, 2026
కాసేపట్లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ

మరికాసేపట్లో GHMC స్టాండింగ్ కమిటీ చివరి/ సాధారణ సమావేశం జరగనుంది. ఈ అజెండాలో మొత్తం 9 అంశాలను పొందుపరిచారు. కూకట్పల్లి జోన్లో క్రికెట్ పిచ్లు, షటిల్ కోర్టుల నిర్వహణకు కొత్త టెండర్లు, యూసుఫ్ నగర్ వైకుంఠధామం నిర్వహణ బాధ్యతలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటితో పాటు రూ. 3.45 కోట్లతో బాక్స్ డ్రైన్ నిర్మాణం, రూ. 2.45 కోట్లతో బాక్సింగ్ కోర్టు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపనున్నారు.


