News April 12, 2025
‘సరస్వతి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించాలి’

సరస్వతి పుష్కరాలను సమన్వయంతో, అన్ని విభాగాల అధికారులు టీమ్వర్క్తో విజయవంతంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, పర్యాటక శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డిలతో కలిసి భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఇతర శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News December 2, 2025
నల్గొండ: గ్రామాల్లో అంతర్గత పోరుతో రాజకీయ హీట్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానుండడంతో ప్రధాన పార్టీల్లో రాజకీయం తారాస్థాయికి చేరింది. ఒకే పార్టీ నుంచి పలువురు నేనే సర్పంచ్ అంటూ బరిలో దూసుకురావడంతో అంతర్గత పోరు మొదలైంది. ఇతర పోస్టులు సర్దుబాటు చేస్తామని నేతలు బుజ్జగిస్తున్నా వినకుండా స్వతంత్రగానైనా పోటీ చేస్తామంటూ సిద్ధం కోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది.
News December 2, 2025
HYD: ప్రేమ జంట ఆత్మహత్య(UPDATE)

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో <<18443763>>ప్రేమ జంట<<>> ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, కొత్తూరు పట్టణంలో ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్న అనామిక అదే కంపెనీలో బిహార్కు చెందిన ధనుంజయ్ను ప్రేమించింది. అనామిక పరిశ్రమకు వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
News December 2, 2025
నల్గొండ: మద్య నియంత్రణపై రాష్ట్రానికే ఆదర్శం..!

ఉమ్మడి నల్గొండ పరిధి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గంలోని కొత్త వైన్ షాపులు ఊరి బయటే ఏర్పాటు చేసి మ.1 తర్వాతే విక్రయాలు కొనసాగిస్తున్నారు. సా.6 గంటల తర్వాత మాత్రమే పర్మిట్ రూములకు అనుమతి ఇస్తున్నారు. మద్యం టెండర్లు పొందిన యజమానులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమై బెల్ట్ షాపుల నిషేధం, మద్య నియంత్రణ, స్థానికులకు ప్రాధాన్యం వంటి మార్గదర్శకాలు ఇచ్చారు.


