News April 12, 2025

‘సరస్వతి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించాలి’

image

సరస్వతి పుష్కరాలను సమన్వయంతో, అన్ని విభాగాల అధికారులు టీమ్‌వర్క్‌తో విజయవంతంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, పర్యాటక శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డిలతో కలిసి భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఇతర శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News December 10, 2025

కొత్తగూడెం: డబ్బు కోసం మిత్రుడి హత్య.. జీవిత ఖైదు

image

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు చెప్పారు. కొత్తగూడెం గణేష్ బస్తీకి చెందిన కేతేపల్లి సుధాకర్‌ను అతని మిత్రుడైన చాతకొండకు చెందిన షేక్ బాషా హతమార్చాడు. డబ్బు, గోల్డ్ చైన్, ఉంగరం కోసం ఫోన్ చేసి పిలిచి దాడి చేసి చంపినట్లు 16 మంది సాక్షుల విచారణలో తేలింది. జీవిత ఖైదు, రూ.2వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు విలువరించారు.

News December 10, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
∆} మధిర ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

News December 10, 2025

WGL: రేపే 502 గ్రామాల్లో తొలి పోరు!

image

పంచాయతీ ఎన్నికలకు గ్రామాలు సిద్ధమయ్యాయి. తొలి విడతలో 555 పంచాయతీల్లో ఇప్పటికే 53 పల్లెలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 502 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు 1,749 మంది బరిలో ఉన్నారు. 4,952 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 8,676 మంది బరిలో ఉండగా, 981 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. 502 జీపీల్లో WGL 731, HN 658, జనగామలో 1024, భూపాలపల్లిలో 664, ములుగు 436, MHBDలో 1,072 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.