News April 12, 2025

‘సరస్వతి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించాలి’

image

సరస్వతి పుష్కరాలను సమన్వయంతో, అన్ని విభాగాల అధికారులు టీమ్‌వర్క్‌తో విజయవంతంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, పర్యాటక శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డిలతో కలిసి భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఇతర శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News December 4, 2025

పాలకొల్లు: మహిళ హత్య కేసులో..నిందితుడు అరెస్టు

image

పాలకొల్లులో ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు..పాలకొల్లు టిడ్కో ఇంటిని అద్దె తీసుకుని రాధ అనే మహిళతో సుధాకర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. మద్యం మత్తులో రాధతో గొడవ పడి టిట్కో భవనం మేడపైకి తీసుకెళ్లి..తోసేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. కుమారై భవ్యశ్రీ ఫిర్యాదుతో సుధాకర్‌ను అరెస్టు చేశామని ఎస్సై పృథ్వీ తెలిపారు.

News December 4, 2025

రూపాయి.. ఇంకా కిందికి?

image

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ₹90ని క్రాస్ చేసింది. 2026 చివరి నాటికి ₹91.5కి చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. FIIలు తిరిగి ఇండియన్ మార్కెట్‌లో కొనుగోళ్లు చేపడితే డాలర్‌కు డిమాండ్ తగ్గి రూపాయి విలువ స్టెబిలైజ్ అవుతుందంటున్నారు. FIIల అమ్మకాలు కొనసాగితే మరింత <<18457079>>క్షీణిస్తుందని<<>> పేర్కొంటున్నారు. చమురు ధరలు పెరిగినా, భారత్-US మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యమైనా రూపీ పడిపోతుందని చెబుతున్నారు.

News December 4, 2025

ఏలూరును నాటుసారా రహిత జిల్లాగా చేస్తా: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో నాటుసారా రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. నాటు సారా తయారీని విడిచిపెట్టిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలపై అధికారులతో బుధవారం సమీక్షించారు. సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. గతంలో వివిధ శాఖల ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగిందని, తిరిగి నాటు సారా జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.