News December 7, 2024
సరూర్నగర్ BJP సభ (అప్డేట్స్)
సరూర్నగర్ సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపామని BJP నేతలు పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, BJP ఎమ్మెల్యేలు, హైదరాబాద్, రంగారెడ్డికి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజల పక్షాణ BJP నిరంతరం పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.
Similar News
News January 17, 2025
రంగారెడ్డి : హైదరాబాద్లో తగ్గిన వాయు కాలుష్యం
సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ వాసులంతా సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నివాస వాణిజ్య ప్రాంతాల్లో కాలుష్య కారకాలు గణనీయంగా తగ్గిపోగా.. పారిశ్రామిక వాడల్లో మాత్రం కాస్త అధికంగా నమోదైందన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ ముగియడంతో మళ్లీ హైదరాబాదులో కాలుష్యం గణనీయంగా పెరిగిపోతుందని అధికారులు పేర్కొన్నారు.
News January 17, 2025
బీసీ మేధావుల సదస్సులో రాజ్యసభ ఎంపీ
కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో శుక్రవారం బీసీ మేధావుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. మండలి ప్రతిపక్షనేత సీ.మధుసూదనాచారి, ఆల్ ఇండియా ఓబీసీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి, బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, అఖిలపక్ష ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, కులసంఘాల సభ్యులు సదస్సులో పాల్గొన్నారు.
News January 17, 2025
HYD: చేవెళ్లలో త్వరలో ఉపఎన్నిక: కేటీఆర్
చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. చేవెళ్లకు త్వరలో ఉప ఎన్నిక రాబోతోందని KTR వ్యాఖ్యలపై మీరేమంటారు. కామెంట్ చేయండి.