News February 12, 2025
సర్కారు బడిలో సార్ బిడ్డ..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739366116351_20560214-normal-WIFI.webp)
సర్కారు బడి బలోపేతం కోసం మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు ఈ టీచర్. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంకి చెందిన నర్సింగ్ నరేశ్ పాలకీడు ZPHS తెలుగు టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె నర్సింగ్ నేహాను కీతవారిగూడెం ZPHSలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీచర్ల కాంప్లెక్స్ మీటింగ్ కీతవారిగూడెంలో నిర్వహించగా ఈ విషయం తెలియడంతో HM సువర్ణ, టీచర్లు నరేష్ను ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News February 13, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో మంటల్లో చిక్కుకొని వృద్ధుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739407750970_727-normal-WIFI.webp)
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షికి సమీపంలో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని మహబూబ్ బాషా అనే వృద్ధుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహబూబ్ బాషా తన పొలం దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో తన పొలం పక్కనే ఉన్న గడ్డివాముకు నిప్పు అంటుకుంది. తన చేనులోకి మంటలు ఎక్కడ పడతాయో అన్న ఉద్దేశంతో మహబూబ్ బాషా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పొగకు ఊపిరాడక మంటల్లో చిక్కుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
News February 13, 2025
ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వండి: డీకే అరుణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739407567317_774-normal-WIFI.webp)
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్ 5వ శక్తి పీఠం జోగులాంబ టెంపుల్తో పాటు కురుమూర్తి, మన్యంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదనలపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు.
News February 13, 2025
కొవ్వూరులో హీరో రామ్ సినిమా షూటింగ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739379724233_1152-normal-WIFI.webp)
సినీ హీరో రామ్ పోతినేని 22వ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. మంగళవారం ఆరికిరేవుల స్నానఘట్టం, గోదావరి నది వద్ద సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్బాబు.పి దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్గా భాగ్యశ్రీ ,రావు రమేష్, బ్రహ్మానందం, హర్షవర్దన్లు నటిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.