News March 2, 2025
సర్కార్ నిర్లక్ష్యంతోనే కార్మికుల దుర్మరణం: వేముల

కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే SLBC టర్మినల్ ఘటనలో 8 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిశాయని కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య అన్నారు. తెలంగాణ భవన్ బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించి బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులపై చిన్న చూపు చూడడం సరికాదన్నారు.
Similar News
News November 4, 2025
వచ్చేనెలలో పుస్తకాల పండుగ.. నగరం సిద్ధమా?

HYDలో బుక్ ఫెయిర్.. ఈ పేరు వింటే చాలు పుస్తక ప్రేమికులు పులకించిపోతారు. ఏటా నగరంలో జరిగే ఈ వేడుక కోసం ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది ఈ ఫెస్టివల్ వచ్చేనెలలో జరగబోతోంది. ఎన్టీఆర్ స్టేడియంలో DEC 19 నుంచి 10 రోజుల పాటు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కేవలం పుస్తక విక్రయాలే కాకుండా సాహితీ చర్చలు, పుస్తక ఆవిష్కరణలు ఉంటాయని బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు యాకూబ్, శ్రీనివాస్ తెలిపారు.
News November 4, 2025
మీర్జాగూడ ఘటన.. ఆ గుంత పూడ్చివేత

చేవెళ్ల మండలం మీర్జాగూడలో నిన్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి కారణమైన గుంతను అధికారులు ఈరోజు పూడ్చివేసినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుపై ఏర్పడ్డ గుంతను తప్పించడానికి టిప్పర్ డ్రైవర్ ప్రయత్నించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ముందే రోడ్డుకు మరమ్మతులు చేసి ఉంటే అంత మంది ప్రాణాలు పోయేవి కావంటున్నారు.
News November 4, 2025
తెల్లారకముందే జూబ్లీలో పార్టీల కూత

సూర్యుడు ఇంకా ఉదయించక ముందే.. మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జూబ్లీ వీధుల్లో వాలిపోతున్నారు. ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను కలుస్తూ నచ్చిన హామీలిస్తున్నారు. ప్రచారానికి వెళ్లడం ఆలస్యమైతే ఓటర్లు పనులకు వెళ్లిపోతారని కాబోలు. ఇక్కడ ఎక్కువ శాతం బస్తీలు ఉండటంతో ప్రజలు ఉపాధి కోసం పనులకు వెళ్తారు. అందుకే నాయకులు ఉదయాన్నే ప్రచారానికి వెళుతున్నారు.


